Skip to main content

Posts

Showing posts with the label local news

సైబర్ నేరగాళ్లను మించిన 'ఇసుక' దొంగలు.. లబ్ధిదారులకు తెలియకుండానే ఆధార్‌తో మాయాజాలం!

  సైబర్ నేరగాళ్లను మించిన 'ఇసుక' దొంగలు.. లబ్ధిదారులకు తెలియకుండానే ఆధార్‌తో మాయాజాలం! ఇల్లంతకుంట, ఏప్రిల్ 17 (న్యూస్ పవర్): రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం లబ్ధిదారులు అందజేసిన ఆధార్ కార్డులు, ప్రొసీడింగ్ పత్రాలను అక్రమార్కులు ఆయుధంగా చేసుకుంటున్నారు. లబ్ధిదారులకు కనీస సమాచారం లేకుండానే వారి పేరుతో ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన వైనం: సోమారంపేట గ్రామానికి చెందిన ఒక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి పేరుతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇసుక బుక్ చేశారు. ఈ విషయంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సదరు లబ్ధిదారుడికి ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. తనకు తెలియకుండానే తన పత్రాలను వాడుతున్నారని తెలుసుకున్న బాధితుడు విస్మయానికి గురయ్యాడు. మోసం జరుగుతోందిలా: పాత పత్రాల దుర్వినియోగం: గతంలో ఇసుక పర్మిషన్ కోసం  ఇచ్చిన జిరాక్స్ కాపీలను ఇసుక ట్రాక్టర్ల యజమానులు  భద్రపరుచుకున్నారు. ధరల వ్యత్యాసమే పెట్టుబడి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 250 లకే ఇసుక పర్మిషన్ లభిస్తుంది (6 ట్రిప్ప...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలకు ఆహ్వానం

ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలకు ఆహ్వానం జనం న్యూస్, 11 మార్చి , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామం సీతారాముల దేవాలయంలో ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించి  బుధవారం రోజున పత్రిక ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.ఆలయ వేద పండితులు,గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం పత్రిక ప్రతిష్ట చేసి గ్రామ ప్రజలందరినీ మహోత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,మాజీ ఉపసర్పంచ్లు,మాజీ మార్కెట్ డైరెక్టర్లు,స్థానిక వార్డ్ మెంబర్లు,ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం పరుశురాం,మండల రిపోర్టర్ బొంగోని రాజు,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

గాలిపల్లి లో "పది" విద్యార్థులకు పరీక్ష సామాగ్రీ అందజేత.

గాలిపల్లి లో "పది" విద్యార్థులకు పరీక్ష సామాగ్రీ అందజేత.  న్యూస్ పవర్ , 11 మార్చి , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు వ్రాసేందుకు ఉపయోగపడే ఫ్యాడ్స్, పెన్నులు, రబ్బర్, స్కెల్, తో పాటు పాఠశాలలోని విద్యార్థులకు( క్రీడాకారులకు) జెర్సీ లను గాలిపల్లి కి చెందిన సింగిరెడ్డి భరత్ రెడ్డి జ్ఞాపకార్థం తన తండ్రి అయిన సింగిరెడ్డి తిరుపతిరెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయు్రాలు మేకల పావని చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరీక్షలు అంటే భయం వీడి కష్టం తో కాకుండా ఇష్టం తో పరీక్షలు మంచిగా వ్రాసి మంచి మార్కులు తెచ్చుకొని పాఠశాల, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అకాంక్షించారు.ఈ సందర్బంగా పరీక్ష సామాగ్రీ ని అందించిన తిరుపతి రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాళు మేకల పావని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బట్టు పద్మ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ ఇంచార్జి కేశవేణి శ్రీనివాస్ యాదవ్, పి డి సాన బాబు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగాలి - ఇల్లంతకుంటలో మహిళా దినోత్సవ వేడుకలు

  మహిళలు మనోధైర్యంతో ముందడుగు వేయాలి: ఇల్లంతకుంట ఎస్సై అశోక్ పిలుపు ఇల్లంతకుంట : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ మరియు సర్పంచ్ మామిడి రాజులు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) పురస్కరించుకుని మండల కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహిళా శక్తి - కుటుంబ అభివృద్ధి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. నేడు దేశంలో జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్రపతి వరకు మహిళలే ఉన్నత స్థానాల్లో ఉండి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లులకు వివిధ విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచడంలో తల్లుల పాత్ర మరువలేనిదని వక్తలు కొనియాడారు. పాల్గొన్న ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తూము...

గాలిపల్లి లో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ & సెలెక్షన్స్

  గాలిపల్లి లో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ & సెలెక్షన్స్  న్యూస్ పవర్ , 12 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :  తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం ఆదేశానుసారం రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్ & సెలక్షన్స్ ఇల్లంతకుంట మండలంలోని గాలిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో తేదీ 16 ఫిబ్రవరి 2025 ఆదివారం రోజున నిర్వహించబడునని జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముస్కు మల్లారెడ్డి, సింగారపు తిరుపతి, మండల కార్యదర్శి మామిడి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇట్టి పోటీలలో పాల్గొను బాల బాలికలు తేది 01-04-2009 తర్వాత జన్మించి, 55 కిలోల బరువు దాటకుండా ఉండాలని వారి వెంట ఒరిజినల్ పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తీసుకొని ఉదయం 8:30 గంటల వరకు క్రీడా మైదానంలో రిపోర్టు చేసి ఇట్టి పోటీలను విజయవంతం చేయగలరని కోరుచున్నాము. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. సాన బాబు 9440350422, మామిడి శ...

పాఠశాల ఆవరణలో నర్సరీ తొలగించాలి

పాఠశాల ఆవరణలో నర్సరీ తొలగించాలి   న్యూస్ పవర్, 23 నవంబర్ , ఇల్లంతకుంట : సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని గాలిపల్లి ఉన్నత పాటశాల మైదానంలో గత రెండు సంవత్సరాలుగా నర్సరీ నిర్వహిస్తున్నారు  నర్సరీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టూ గడ్డి పెరిగి పాములు సంచారిస్తున్నయి పలుమార్లు క్లాస్ రూమ్ లోకి కూడ వచ్చాయి  సాయంత్రం ఉదయం సమయంలో యువకులు వ్యాయామానికి వచ్చినపుడు కూడ పాములు దర్శనం ఇస్తున్నాయి కావున విద్యార్థులు పాఠశాలకు రావడానికి భయాందోళన చెందుతున్నారు దీనిపై గతంలో  విద్యార్థుల భయం చూడలేక పాఠశాలకు విద్యార్థుల తల్లితండ్రులు ఈతరం యువజన సంఘం సభ్యులు వెళ్ళి చూడగా నర్సరీ చుట్టూ ఉన్న గడ్డి లో పాములు ఉండగా జిల్లా కలెక్టర్  ఎంపిడిఓ  గ్రామ సెక్రెటరీ లకు నర్సరీ  తొలగించాలని వ్రాత పూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది గత గాలిపల్లి గ్రామ సభలో కూడ తొలగించడానికి తీర్మానం చేయడం జరిగింది ఎన్ని చేసినా కూడ అధికారులు ఇట్టి విషయాని పెడ చెవిన పెట్టడం ఎంత వరకు మంచిదో వారికే తెలియాలి గ్రామ ప్రజలు లేనిది మండల అధికారులు గ్రామ అధికారులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చే...

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం                    న్యూస్ పవర్ , 21 నవంబర్, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్లమెంటు కమిటీ సభ్యుడు దామరసత్యం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమము 2024 -2026 కు   జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నెల 26న వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది  ఉమ్మడి రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు   సుపరిపాలన అందించడంతోపాటు  చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ తెలంగాణలో కనిపిస్తున్నాయి  అభివృద్ధి పలాలు  అందుకున్న ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ అనేకమంది  ఆకర్షితులవుతున్నారు తెలుగుదేశం పార్టీ  బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేసిన విధానాన్ని  ప్రజలకు తీసుకుపోయి  సభ్యత్వ నమోదు వేగం పెంచాలి  మాన...

ఎన్యుమరెటర్లకు శిక్షణ కార్యక్రమము

ఎన్యుమరెటర్లకు  శిక్షణ కార్యక్రమము      న్యూస్ పవర్ , 30 అక్టోబర్ , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్యుమారెటర్లకు ఇంటింటి సమగ్ర కుంటుంబ సర్వే శిక్షణ కార్యక్రమం బుధవారం రోజున నిర్వహించారు.మండల నోడల్ అధికారి రామకృష్ణ జిల్లా కో ఆపరేటివ్ అధికారి సందర్శించి  ఎన్యుమారెటర్లు ప్రతి ఇంటినీ సందర్శించి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రంలో  తహశీల్దార్ ఫరూఖ్ ఎం పి డి ఓ శశికళ ఎం ఈ ఓ శ్రీనివాస్ గౌడ్ మాస్టర్ ట్రైనర్స్ సందీప్ రెడ్డి జగన్మోహన్ సదానందం రాజు.అనిల్కుమార్.మరియు సూపర్వైజర్ లు ఎన్యుమారెటరులు పాల్గొన్నారు.