ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలకు ఆహ్వానం
జనం న్యూస్, 11 మార్చి , ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామం సీతారాముల దేవాలయంలో ఈనెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించి బుధవారం రోజున పత్రిక ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.ఆలయ వేద పండితులు,గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం పత్రిక ప్రతిష్ట చేసి గ్రామ ప్రజలందరినీ మహోత్సవాలకు హాజరై విజయవంతం చేయాలని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు,మాజీ ఉపసర్పంచ్లు,మాజీ మార్కెట్ డైరెక్టర్లు,స్థానిక వార్డ్ మెంబర్లు,ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం పరుశురాం,మండల రిపోర్టర్ బొంగోని రాజు,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
