రెచ్చకొట్టేవిధంగా పోస్టులు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

రెచ్చకొట్టేవిధంగా పోస్టులు చేసిన వ్యక్తిపై కేసు నమోదు

 న్యూస్ పవర్ , 10 మే , ఇల్లంతకుంట :
సోషల్ మీడియాలో రెచ్చకొట్టేవిధంగా పోస్టులు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
 తిప్పాపూర్ గ్రామానికి చెందిన బొర్ర స్వామి   గ్రామ వాట్సాప్ గ్రూపులో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మరియు శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా చేసిన వ్యక్తి పై ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన నాగ సముద్రాల బాలకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు 
 స్వామి వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్ ను సీజ్ చెయ్యడం జరిగిందనీ
 ఇలా ఎవరైనా సోషల్ మీడియా లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేసిన వారిపై కేసు చెయ్యడం జరుగుతుందన్నారు.




Post a Comment

0 Comments