న్యూస్ పవర్ , 11 మే , ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం పేరిట నిరుపేద యువతకు రుణాలు అందించుటకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రకటించగా లక్షల మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది, తీరా సమయానికి సిబిల్ స్కోర్ ఉండాలని నిబంధన పెట్టి లక్షల మంది పేద ప్రజలను మోసం చేస్తున్నారు,నిరుపేద యువతకు అందని ద్రాక్షల మారిందని అన్నారు,రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుపేద యువత ఉపాధి పొందాలనే వారి ఆశలను నిర్వీర్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వం, సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ రాజీవ్ యువవికాసం పథకం ద్వారా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ..లేనియెడల రాజకీయ పార్టీలకు అతీతంగా యువతను, ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమం లో బహుజన ఉద్యమ కారుడు, ఏనుగుల లింగన్న, మండల యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ మామిడి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments