వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలి

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలి


న్యూస్ పవర్ , 11 మే , ఇల్లంతకుంట :
వచ్చే వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి  సత్యనారాయణ ఆకాంక్షించారు.
ఆదివారం మండల కేంద్రమైన ఇల్లంతకుంట, రామోజీపేట గ్రామాల్లోని పెద్దమ్మ తల్లి గుళ్ళల్లో జరుగుతున్న పెద్దమ్మ- పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రానున్న వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్లు చెప్పారు. గుడి పెద్దలు కోరిక మేరకు పెద్దమ్మ తల్లి గుడి ఆవరణలో సిమెంట్ తో ఫ్లోరింగ్ చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ అధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు పసుల వెంకట్, ఐరెడ్డి మహేందర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎలగందుల ప్రసాద్, ఐరెడ్డి సురేందర్ రెడ్డి, చిక్కుడు సత్యం, చొప్పరి భూమయ్య, బడుగు లింగంతో పాటు గుడి పెద్దలు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments