Skip to main content

Posts

అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి

అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి    న్యూస్ పవర్  , 24 ఆగస్టు , ఇల్లంతకుంట : అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలనీ సామాజిక ఉద్యమ కారుడు,తెలంగాణ అంబేద్కర్ యువసేన  రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ అన్నారు, ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి,ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ లకు  హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి   రాగానే అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు,రాహుల్ గాంధీ ,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  కలిసి ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్థం పథకం కింద రూ" 12 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించి, ప్రభుత్వం ఏర్పడి రెండు గడుస్తున్నా నేటికీ అమలు చేయకపోవడం అంబేద్కర్ ని అవమానపరచడమే అన్నారు,చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లో కాంగ్ర...

గీతాకార్మికులకు ఐడి కార్డులు పంపిణీ

గీతాకార్మికులకు ఐడి కార్డులు పంపిణీ   న్యూస్ పవర్ , 24 ఆగస్టు , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన 11మంది గీతా కార్మికులకు సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సి ఐ ఎం శ్రీనివాస్ సోమవారం గీతా కార్మికులకు పెన్షన్ దరఖాస్తుల కోసం గాను గీతా కార్మిక ఐడి కార్డులను పంపిణీ చేశారు అర్హులైన గీతా కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన గీతకార్మిక సంఘ సభ్యులను కోరారు 50 సంవత్సరములు నిండిన గీతా కార్మికులు ఐడి కార్డ్ కలిగినటువంటి వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన గీతకార్మిక సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్  ఎ స్సై బత్తిని ప్రణీత్ గౌడ్ ఇల్లంతకుంట గౌడ సంఘ అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు అంతటి రమేశ్ గౌడ్ కోశాధికారి ముంజ భాస్కర్ సారా రమేశ్ గౌడ్ కొయ్యడ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

నెల రోజుల్లో అనంతారం బిక్కవాగు బ్రిడ్జి పూర్తి చేయాలి

  ఇల్లంతకుంట: మండల పరిధిలోని అనంతారం గ్రామంలో గల బిక్కవాగుపై వంతెన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై అక్కెం నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వంతెనను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ నేటికీ ఆ హామీని నెరవేర్చకుండా పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు కేవలం గన్నేరువరం ప్రజలే ఓట్లు వేశారా, ఇల్లంతకుంట మండల ప్రజలు ఓట్లు వేయలేదా అని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. గన్నేరువరం సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే, అదే చిత్తశుద్ధితో అనంతారం బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం కూడా దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గనుక దీక్షకు సిద్ధపడితే అందుకు కావాల్సిన ఫ్లెక్సీలు, పూలదండలు, ఇతర సామగ్రి ఖర్చులన్నింటినీ తానే స్వయంగా భరిస్తానని స్పష్టం చేశారు. వంతెన పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో బ్రిడ్జికి ఇరువైపులా నిత్యం తీవ్ర ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు అనంత...

ఇల్లంతకుంట మండల అభివృద్ధికి నిరంతరం కృషి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఇల్లంతకుంట మండల అభివృద్ధికి నిరంతరం కృషి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ • సాగునీటి విడుదల, రహదారుల నిర్మాణాలపై వినతిపత్రం అందజేసిన మండల సర్పంచులు ఇల్లంతకుంట మండలంలోని రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మండలంలో రోడ్లు, వంతెనల నిర్మాణాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం మానకొండూర్ క్యాంపు కార్యాలయంలో ఇల్లంతకుంట మండల సర్పంచులు ఎమ్మెల్యేను కలిసి మండల పరిధిలోని పలు సమస్యలపై సమగ్ర వినతిపత్రం అందజేశారు. ​మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసి, అక్కడి నుండి అనంతారం చెరువులోకి నీటిని చేర్చడం ద్వారా బిక్కవాగు ప్రవహించి పరిసర ప్రాంతాల రైతుల పొలాలకు సాగునీరు అందుతుందని, వెంటనే నీటిని విడుదల చేయాలని సర్పంచులు కోరారు. అలాగే మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా కూడా నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ మిడ్ మానేరు ఎస్ఈ (SE)తో ఫోన్‌లో మాట్లాడి నీటి విడుదలకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. స్వయంగా సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి రైతులకు సాగునీరు అందేలా చూ...

అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి సిరిసిల్లలో మినీ జాబ్ మేళా | Apollo Pharmacy Mini Job Mela Sircilla

  తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ అపోలో ఫార్మసీ (Apollo Pharmacy) ఉద్యోగాల భర్తీకి మినీ జాబ్ మేళా నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళా 21-08-2026 (శుక్రవారం) నాడు సిరిసిల్లలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరగనుంది. ఈ నియామకాల ద్వారా హైదరాబాద్ పరిధిలోని అపోలో ఫార్మసీ స్టోర్లలో మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీల వివరాలు (Vacancy Details) పోస్ట్ పేరువిద్యార్హతఖాళీలువయోపరిమితిజీతం (నెలకు)జెండర్ PharmacistD.Pharm / B.Pharm / M.Pharm (PCI సర్టిఫికెట్ ఉండాలి)4018 - 35 సం॥₹17,000/- Gross + ₹2,000 సిటీ అలవెన్స్పురుషులు / స్త్రీలు Trainee PharmacistD.Pharm / B.Pharm / M.Pharm (Without PCI)2018 - 35 సం॥₹14,500/- Gross (Fresher / Exp)పురుషులు మాత్రమే Pharmacy Assistant10th లేదా ఆపై చదువు (2 సం॥ మెడికల్ స్టోర్ అనుభవం)3018 - 35 సం॥₹14,000/- నుండి ₹18,000/- వరకుపురుషులు మాత్రమే Retail Trainee Associate10th లేదా ఆపై చదువు (ఫ్రెషర్స్)10 అదనపు ప్రయోజనాలు (Benefits) PF, ESI సౌకర్యం నె...

ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మామిడి రాజు

ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మామిడి రాజు  •  సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ న్యూస్ పవర్ ,  18 ఆగస్టు , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ఏర్పాటు అంశంతో పాటు వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచులు ప్రస్తావించిన సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన కొన్ని అభివృద్ధి పనులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సర్పంచుల ఫోరం అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగగా, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు పేరును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. సమావేశంలో పాల్గొన్న సర్పంచులంతా చప్పట్లతో ఏకగ్...

వరి నుంచి ఆయిల్ పామ్ సాగులోకి..

వరి నుంచి ఆయిల్ పామ్ సాగులోకి.. • ఇల్లంతకుంట మండలం దాచారంలో 19 ఎకరాల్లో వేసిన ఇద్దరు రైతులు • పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ • ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 386 ఎకరాల్లో వరి నుంచి ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు న్యూస్ పవర్ , 18 ఆగస్టు , ఇల్లంతకుంట: సంప్రదాయ వరిసాగు నుంచి దీర్ఘకాలిక ఆదాయం సమకూరే ఆయిల్ పామ్ సాగులోకి పలువురు రైతులు మారారు. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన సురభి రవీందర్ రావు 10 ఎకరాలు, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలు తెలుసుకొని సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికారు. దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సురభి రవీందర్ రావు, సురభి సంతోష్ రావు ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.  క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు తో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్...