ఇల్లంతకుంట మండల అభివృద్ధికి నిరంతరం కృషి: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ • సాగునీటి విడుదల, రహదారుల నిర్మాణాలపై వినతిపత్రం అందజేసిన మండల సర్పంచులు ఇల్లంతకుంట మండలంలోని రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించడంతో పాటు మండలంలో రోడ్లు, వంతెనల నిర్మాణాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం మానకొండూర్ క్యాంపు కార్యాలయంలో ఇల్లంతకుంట మండల సర్పంచులు ఎమ్మెల్యేను కలిసి మండల పరిధిలోని పలు సమస్యలపై సమగ్ర వినతిపత్రం అందజేశారు. మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసి, అక్కడి నుండి అనంతారం చెరువులోకి నీటిని చేర్చడం ద్వారా బిక్కవాగు ప్రవహించి పరిసర ప్రాంతాల రైతుల పొలాలకు సాగునీరు అందుతుందని, వెంటనే నీటిని విడుదల చేయాలని సర్పంచులు కోరారు. అలాగే మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా కూడా నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ మిడ్ మానేరు ఎస్ఈ (SE)తో ఫోన్లో మాట్లాడి నీటి విడుదలకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. స్వయంగా సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి రైతులకు సాగునీరు అందేలా చూ...