Skip to main content

Posts

ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మామిడి రాజు

ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా మామిడి రాజు  •  సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి హామీ న్యూస్ పవర్ ,  18 ఆగస్టు , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ ఊట్కూరి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు ఎల్‌ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం ఏర్పాటు అంశంతో పాటు వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచులు ప్రస్తావించిన సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన కొన్ని అభివృద్ధి పనులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సర్పంచుల ఫోరం అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరగగా, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు పేరును ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. సమావేశంలో పాల్గొన్న సర్పంచులంతా చప్పట్లతో ఏకగ్...

వరి నుంచి ఆయిల్ పామ్ సాగులోకి..

వరి నుంచి ఆయిల్ పామ్ సాగులోకి.. • ఇల్లంతకుంట మండలం దాచారంలో 19 ఎకరాల్లో వేసిన ఇద్దరు రైతులు • పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ • ఈ సీజన్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 386 ఎకరాల్లో వరి నుంచి ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు న్యూస్ పవర్ , 18 ఆగస్టు , ఇల్లంతకుంట: సంప్రదాయ వరిసాగు నుంచి దీర్ఘకాలిక ఆదాయం సమకూరే ఆయిల్ పామ్ సాగులోకి పలువురు రైతులు మారారు. ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన సురభి రవీందర్ రావు 10 ఎకరాలు, సురభి సంతోష్ రావు 9 ఎకరాల్లో వరి సాగు చేసేవారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలు తెలుసుకొని సంప్రదాయ వరిసాగుకు స్వస్తి పలికారు. దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. సురభి రవీందర్ రావు, సురభి సంతోష్ రావు ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.  క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రణాళిక ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రదర్శనలు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు తో లాభాలను వివరిస్తూ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్...

రైతులకు వెన్నుదన్నుగా ప్యాక్స్‌లు: ఇల్లంతకుంట ప్యాక్స్ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

  రైతులకు వెన్నుదన్నుగా ప్యాక్స్‌లు (PACS) నిలవాలి: ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) అన్నదాతలకు అండగా, వెన్నుదన్నుగా నిలవాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్ఘాటించారు. శుక్రవారం ఇల్లంతకుంట ప్యాక్స్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే.. నూతన సభ్యులను అభినందించి, పలు కీలక సూచనలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన నూతన పాలకవర్గం నూతనంగా ఎన్నికైన ఇల్లంతకుంట ప్యాక్స్ పాలకవర్గం ఎమ్మెల్యే సమక్షంలో బాధ్యతలు స్వీకరించింది.  సభ్యుల వివరాలు: చైర్మన్: ఊట్కూరి వెంకట రమణారెడ్డి వైస్ చైర్మన్: యాస తిరుపతి డైరెక్టర్లు: సొల్లు కవిత ఉప్పుల సంజీవరెడ్డి సింగిరెడ్డి లక్ష్మి కేతిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి కోనేటి నర్సయ్య ముక్కిస ఎల్లారెడ్డి గుండా వెంకటేశం ఎలుక అనిల్ కుమార్ ఏలేటి మాధవరెడ్డి జాప బాల్ రెడ్డి ఒగ్గు రమేశ్ పారదర్శకంగా వ్యవహరించి ఆదర్శంగా నిలవాలి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు: సకాలంలో సేవలు: రైతులకు అవసరమైన రుణాలు...

తెలంగాణ బీసీ మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం | అర్హతలు, దరఖాస్తు వివరాలు

  తెలంగాణ బీసీ మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ: పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ (వెనుకబడిన తరగతుల) మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టింది. పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, లక్ష్యాలు మరియు పంపిణీ ప్రణాళికను ఈ క్రింది వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. పథకం ముఖ్య అంశాలు (Scheme Highlights) | అంశం | వివరాలు | |---|---| | పథకం పేరు | ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం | | లబ్ధిదారులు | కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలు | | సబ్సిడీ | 100% ఉచితం (ప్రభుత్వ సబ్సిడీ) | | మొత్తం మిషన్ల సంఖ్య | 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు | | నియోజకవర్గానికి సంఖ్య | ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,000 మిషన్లు | | ప్రారంభ తేదీ & సమయం | ఆగస్టు 13 (గురువారం), మధ్యాహ్నం 12:00 గంటలకు | | ప్...

రాజన్న సిరిసిల్ల: చేయూత పెన్షన్ దరఖాస్తుల పూర్తి వివరాలు, అర్హతలు (ఆగస్టు 31 ఆఖరు)

  రాజన్న సిరిసిల్ల జిల్లా: చేయూత పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'చేయూత పింఛన్ల' కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన వారు ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. దరఖాస్తు కేంద్రాల్లో వసతులు కల్పించడంతో పాటు, అవసరమైన పత్రాలపై దరఖాస్తుదారులకు పూర్తి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఏడు రకాల పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం మొత్తం ఏడు రకాల లబ్ధిదారుల కోసం ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లికేషన్‌ ఫారాలు జాగ్రత్తగా నింపి, ఆన్‌లైన్‌లో కూడా తప్పులు లేకుండా పూర్తి చేయాలి. సాధారణంగా ప్రతి దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు:  * ఆధార్ కార్డు  * వయసు ధ్రువీకరణ పత్రం (ఓటర్ కార్డు / జనన ధ్రువీకరణ పత్రం / విద్య...

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర న్యూస్ పవర్, 13 ఆగస్ట్, ఇల్లంతకుంట: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మంద అనిల్ కుమార్, సావనపెల్లి మల్లేశం ఆధ్వర్యంలో పొత్తూర్ బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్  హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంద సుదర్శన్ మాట్లాడుతూ... ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబోయే "బద్లావ్ జరూరీ హై" ( మార్పు అత్యవసరం) ర్యాలీలతో ముగుస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి. సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. అలాగే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలి. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి. మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ చ...

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ  ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,    ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎడతెరిపి లేని వర్షాలు  ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.   భారీ వర్షాలు కురుస్తుందున వల్ల  ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాలువలు వద్దకు  ఎవరు వెళ్లవద్దన్నారు.   ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. అలాగే విద్యుత్ పరికరాలను మరియు పోల్స్ కు దూరంగా ఉండాలి.విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి  పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా  10...