Skip to main content

Posts

రాజన్న సిరిసిల్ల మినీ జాబ్ మేళా 2026: ప్రముఖ కార్ల డీలర్ సంస్థల్లో 90 ఉద్యోగాలు | Sircilla Mini Job Mela

  తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్‌షిప్ సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. జాబ్ మేళా ముఖ్యాంశాలు వివరాలు సమాచారం నిర్వహణ విభాగం జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల మొత్తం ఖాళీలు 90 పోస్టులు ఉద్యోగ స్థానం (Job Location) హైదరాబాద్ (Hyderabad) ఇంటర్వ్యూ తేదీ & సమయం 11-09-2026 (శుక్రవారం), ఉదయం 11:00 గంటలకు వేదిక (Venue) రూమ్ నెం. F-16, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), కలెక్టరేట్, సిరిసిల్ల కంపెనీల వారీగా ఖాళీలు, అర్హతలు & జీతం వివరాలు 1. VVC Motors Pvt Ltd (Mahindra Car Dealer) పోస్టు పేరువిద్యార్హతవయోపరిమితివేతనం (నెలకు)ఖాళీలు సర్వీస్ టెక్నీషియన్ (Service Technician)ITI, Diploma, Inter pass18 - 26 సం.లు₹15,000 - ₹18,00015 సర్వీస్ అడ్వైజర్ (Service Advisor)Diploma / BE / B.Tech / Degre...

ఇల్లంతకుంట మండలంలో పెండింగ్ కాలువల పనులు తక్షణమే పూర్తి చేయాలి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య డిమాండ్

ఇల్లంతకుంట మండలంలో పెండింగ్ కాలువల పనులు తక్షణమే పూర్తి చేయాలి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య డిమాండ్ దాచారం (ఇల్లంతకుంట): దాచారం గ్రామంలో పెండింగ్‌లో ఉన్న 5 సాగునీటి కాలువల నిర్మాణ పనులను ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బీజేపీ ఇల్లంతకుంట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాచారంలోని ఈ ఐదు కాలువల పనులు పూర్తయితే రెండు మండలాల్లోని అనేక గ్రామాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.  * ఇల్లంతకుంట మండలం: దాచారం, బోటివానిపల్లి, సిరికొండ, తెలుగువారిపల్లి, పెద్ద లింగాపూర్, రామాజీపేట.  * తంగళ్ళపల్లి మండలం: చిన్న లింగాపూర్, జిల్లెల్ల, నర్సింహులపల్లె, బస్సాపూర్ తదితర గ్రామాలు. ఈ గ్రామాలన్నింటికీ సాగునీరు సక్రమంగా అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో మురుగు నీరు సక్రమంగా బయటకు వెళ్లే మా...

ఇల్లంతకుంట ప్యాక్స్ (PACS) పదవుల్లో మాదిగలకు తీరని అన్యాయం: అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు సావనపెల్లి రాకేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించడంలో దళితులకు, ముఖ్యంగా మాదిగలకు తీరని అన్యాయం చేసిందని అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ మండిపడ్డారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి సమన్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పొందుపరిచిన స్ఫూర్తిని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ తుంగలో తొక్కారని విమర్శించారు. ఎమ్మెల్యే అగ్రవర్ణ బడా నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇల్లంతకుంట మండలంలో ఎస్సీ జనాభాలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలకు ఇల్లంతకుంట ప్రాథమిక సహకార సంఘంలోని 12 నామినేటెడ్ పదవుల్లో ఒక్కటి కూడా కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని, ఇది యావత్ మాదిగ జాతిని తీవ్రంగా అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మాదిగలపై సాగుతున్న ఈ రాజకీయ అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10న రౌండ్ టేబుల్...

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు  న్యూస్ పవర్  , 5 సెప్టెంబర్, ఇల్లంతకుంట:  ఇల్లంతకుంట  మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో  ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణలో  శనివారం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలను వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది అన్నారు. దేశ భవిష్యత్తు  తరగతి గదులలోనే  రూపొందుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను  గౌరవించడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి, సుమంగళి, శోభ, మహాలక్ష్మి, సునంద, మౌనిక, కళ్యాణి, శమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ, రేణుక, స్వాతి, సునీత, ఉష, లావణ్య తో పాటు  విద్యార్థులు పాల్గొన్నారు.

భూముల రీ సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

  భూముల రీ సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఇల్లంతకుంట (ఆగస్టు 27): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’ కార్యక్రమంలో భాగంగా భూముల రీ సర్వే వివరాలను ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత పక్కాగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో రోవర్ (Rover) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన, సర్వే కొలతలు ఎలా తీసుకుంటున్నారు? వివరాల నమోదు విధానం ఎలా ఉంది? అనే అంశాలను స్వయంగా పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాలు & కీలక సూచనలు: పారదర్శకత: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలి. రైతులకు ముందస్తు సమాచారం: సర్వే చేపట్టే గ్రామాల్లోని రైతులకు ముందుగానే స్పష్టమైన సమాచారం అందించాలి, తద్వారా వారికి ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా సమన్వయం చేసుకోవచ్చు. పక్క...

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షబందన్ వేడుకలు

  ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షబందన్ వేడుకలు న్యూస్ పవర్ , 27 ఆగస్టు , ఇల్లంతకుంట: ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మరియు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వక్తగా అక్కేం నాగరాజు  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తాం అని విద్యార్థుల్లో సోదర భావం, సామాజిక సమరసత ,జాతీయత, స్వదేశీ భావన,ఆధ్యాత్మిక చింతన మరియు క్రమశిక్షణ పెంపోదించడం మరియు దేశభక్తిని నింపడం, ప్రతి విద్యార్ధి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని సమాజంలో జరుగుతున్న అసంఘీక శక్తులను ఎదురుకోవాలి అని, ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి మరియు మంచిని చేరదియాలి అని చెడుకు దూరంగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు , మంద వంశీకృష్ణ బొల్లం ప్రశాంత్ మల్యాల పర్శరాములు మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

వాణినికేతన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

  వాణినికేతన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు న్యూస్ పవర్, 27 ఆగస్టు, ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్‌లో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, అధికారులకు రాఖీలు కట్టారు. ఫ్యాక్స్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ రాచకట్ల సురేష్, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మామిడి రాజుతో పాటు పాలకవర్గ సభ్యులకు, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఉపేంద్ర చారితో పాటు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టారు. అలాగే ముస్కాన్‌పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సహకార బ్యాంక్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పేర్కొంటూ విద్యార్థులకు రక్షాబంధన్ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్...