Skip to main content

Posts

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ  ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,    ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎడతెరిపి లేని వర్షాలు  ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.   భారీ వర్షాలు కురుస్తుందున వల్ల  ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాలువలు వద్దకు  ఎవరు వెళ్లవద్దన్నారు.   ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. అలాగే విద్యుత్ పరికరాలను మరియు పోల్స్ కు దూరంగా ఉండాలి.విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి  పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా  10...

తెలంగాణలో 'ఫ్యామిలీ రిజిస్టర్' విధానం ప్రారంభం: జీవో 172 జారీ | మీ సేవ ద్వారా సర్టిఫికెట్ పొందే పూర్తి వివరాలు

తెలంగాణలో 'ఫ్యామిలీ రిజిస్టర్' విధానం ప్రారంభం: జీవో 172 జారీ | మీ సేవ ద్వారా సర్టిఫికెట్ పొందే పూర్తి వివరాలు ​ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఒకే డిజిటల్ రికార్డులో నమోదు చేసేందుకు 'తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్' వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి జీవో 172 (G.O. 172) ను విడుదల చేసింది. ​ఈ నూతన విధానం వల్ల ప్రభుత్వ సేవలు మరియు వివిధ ధృవీకరణ పత్రాలు పొందడం మరింత సులభతరం కానుంది. ​📌 తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ – ముఖ్యాంశాలు ​ ఒకే డిజిటల్ రికార్డు: కుటుంబ సభ్యులందరి పూర్తి సమాచారం ఒకే డిజిటల్ రికార్డులో నమోదవుతుంది. ​ సేవలు జారీ: మీ సేవ (MeeSeva) కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. ​ డేటా మూలం: ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (రేషన్ కార్డు) డేటాబేస్ ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తారు. ​ పరిమితి: ఇది కేవలం కుటుంబ సభ్యుల వివరాల అధికారిక రికార్డు మాత్రమే . ​📋 ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికె...

వాణినికేతన్ హై స్కూల్ లో ఘనంగా మెహందీ ఫెస్ట్

వాణినికేతన్ హై స్కూల్ లో ఘనంగా మెహందీ ఫెస్ట్  న్యూస్ పవర్, 24 జూలై , ఇల్లంతకుంట: విద్యార్థులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన   మెహందీ ఫెస్ట్ - 2026 ఘనంగా జరిగింది. వాణినికేతన్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం చేతులకు గోరింటాకు మనసుకు సంతోషం అనే నినాదంతో   చేపట్టిన కార్యక్రమానికి విద్యార్థినీలు సంప్రదాయ దుస్తులలో హాజరై ఉత్సవంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  తూముకుంట శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ విద్యతో పాటు, కళలు, సంస్కృతి సాంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, పోటీత్వాన్ని పెంపొందించడానికి పాఠశాలలో తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థినీలు తమదైన శైలిలో వివిధ రీతుల గోరింటాకు డిజైన్లను రూపొందించి పోటీలో ఆసక్తిగా పాల్గొన్నారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయినీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక...

డ్రగ్స్ మహమ్మారికి యువత దూరంగా ఉండాలి

డ్రగ్స్ మహమ్మారికి యువత దూరంగా ఉండాలి • ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్  న్యూస్ పవర్ , 22 జూన్ , ఇల్లంతకుంట: యువత, విద్యార్థులు డ్రగ్స్ వంటి మహమ్మారులకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్  లో ఎస్సై  ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. రహీంఖాన్ పేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించినా లేదా వాడుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. అలాగే విద్యార్థులు మెయిల్ ద్వారా...

వర్షాల కోసం జలాభిషేకాలు

వర్షాల కోసం జలాభిషేకాలు న్యూస్ పవర్ , 20 జూన్ , ఇల్లంతకుంట: వర్షాల కోసం కరుణించమని వానదేవుడిని వేడుకుంటూ,వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట  మండలం కందికట్కూర్ గ్రామం లోని అన్ని దేవాలయాల్లో మహిళలు జలాభిషే కాలు నిర్వహించారు. వర్షాలు లేక ఎండల తీవ్రత పెరిగి పొలాలు బీడు పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ ప్రజలు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వానదేవుడు కరుణించి, సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ  ఉపాధి హామీ కూలీలు   మహిళలు మాట్లాడుతూ, "వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో దైవ కృప కోసం అందరం కలిసి ఈ పూజలు చేశాం. వాన దేవుడు తమ మొర ఆలకించి, మంచి వర్షాలు కురిపిస్తాడని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

వరి ధాన్యం రోడ్లమీద ఆరబోయడం వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు

  వరి ధాన్యం రోడ్లమీద ఆరబోయడం వల్ల పొంచి ఉన్న ప్రమాదాలు   న్యూస్ పవర్,  1 మే , ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలంలోని ప్రధాన రహదారులపై వరి ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులకు తీవ్ర ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఎస్సై సిరిసిల్ల అశోక్  తెలిపారు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రోడ్లపై ధాన్యం ఆరబోయడం వల్ల రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని దీనివల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు రైతులు తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి సెంటర్లలో మాత్రమే ఆరబోయాలని సూచించారు ప్రజల భద్రత దృష్ట్యా రైతులు అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఇల్లంతకుంట మండల ప్రజలకు గమనిక: సెన్సస్ 2027 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' ప్రక్రియ ప్రారంభం!

  ఇల్లంతకుంట మండల ప్రజలకు గమనిక: సెన్సస్ 2027 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' ప్రక్రియ ప్రారంభం! ఇల్లంతకుంట: దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సెన్సస్ 2027 (జనగణన) సర్వేలో భాగంగా ఇల్లంతకుంట మండలంలో కీలక అడుగు పడింది. మండల తహసీల్దార్  ఆధ్వర్యంలో ఈరోజు 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' (స్వయంగా వివరాల నమోదు) ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభం ముస్కానిపేట సర్పంచ్  భాస్కర్ రెడ్డి  మరియు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్  ఎలగందుల ప్రసాద్  నివాసాల్లో వారి వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని విజయవంతంగా లాంచ్ చేశారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎలా చేసుకోవాలి? మండల ప్రజలందరూ తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. ఈ క్రింది దశలను పాటించండి: ముందుగా గూగుల్‌లో se.census.gov.in అని టైప్ చేయండి. వెబ్‌సైట్ ఓపెన్ కాగానే మీ వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి. వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత 'సబ్మిట్' బటన్ నొక్కండి. సమర్పణ విజయవంతం అయిన తర్వాత మీకు ఒక ID నంబర్ వస్తుంది. ఆ ID నంబర్‌ను జాగ్రత్...