Skip to main content

Posts

భూముల రీ సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

  భూముల రీ సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఇల్లంతకుంట (ఆగస్టు 27): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’ కార్యక్రమంలో భాగంగా భూముల రీ సర్వే వివరాలను ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత పక్కాగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో రోవర్ (Rover) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పరిశీలించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లిన ఆయన, సర్వే కొలతలు ఎలా తీసుకుంటున్నారు? వివరాల నమోదు విధానం ఎలా ఉంది? అనే అంశాలను స్వయంగా పరిశీలించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ ఆదేశాలు & కీలక సూచనలు: పారదర్శకత: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రీ సర్వే పనులను పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేయాలి. రైతులకు ముందస్తు సమాచారం: సర్వే చేపట్టే గ్రామాల్లోని రైతులకు ముందుగానే స్పష్టమైన సమాచారం అందించాలి, తద్వారా వారికి ఎలాంటి అనుమానాలు తలెత్తకుండా సమన్వయం చేసుకోవచ్చు. పక్క...

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షబందన్ వేడుకలు

  ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా రక్షబందన్ వేడుకలు న్యూస్ పవర్ , 27 ఆగస్టు , ఇల్లంతకుంట: ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండలం లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మరియు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వక్తగా అక్కేం నాగరాజు  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తాం అని విద్యార్థుల్లో సోదర భావం, సామాజిక సమరసత ,జాతీయత, స్వదేశీ భావన,ఆధ్యాత్మిక చింతన మరియు క్రమశిక్షణ పెంపోదించడం మరియు దేశభక్తిని నింపడం, ప్రతి విద్యార్ధి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అని సమాజంలో జరుగుతున్న అసంఘీక శక్తులను ఎదురుకోవాలి అని, ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి మరియు మంచిని చేరదియాలి అని చెడుకు దూరంగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు , మంద వంశీకృష్ణ బొల్లం ప్రశాంత్ మల్యాల పర్శరాములు మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

వాణినికేతన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

  వాణినికేతన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు న్యూస్ పవర్, 27 ఆగస్టు, ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్‌లో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, అధికారులకు రాఖీలు కట్టారు. ఫ్యాక్స్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ రాచకట్ల సురేష్, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మామిడి రాజుతో పాటు పాలకవర్గ సభ్యులకు, పోలీస్ స్టేషన్‌లో ఎస్సై ఉపేంద్ర చారితో పాటు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టారు. అలాగే ముస్కాన్‌పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సహకార బ్యాంక్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పేర్కొంటూ విద్యార్థులకు రక్షాబంధన్ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్...

MGNREGS VB G RAM G App: ఉపాధి హామీ జాబ్ కార్డు పేమెంట్, హాజరు, ABPS స్టేటస్ చెకింగ్ విధానం

 # VB G RAM G యాప్‌లో ఉపాధి హామీ పేమెంట్ & అటెండెన్స్ స్టేటస్ చెక్ చేయడం ఎలా? గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) లో పనిచేసే కూలీలకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికతను మరింత సులభతరం చేశాయి. కూలీలు తమ పని దినాలు, హాజరు (అటెండెన్స్), బ్యాంక్ ఖాతాలో జమయ్యే డబ్బుల వివరాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా **VB G RAM G** మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.  ఈ ఆర్టికల్‌లో మీ మొబైల్ ద్వారానే ఇంట్లో కూర్చుని జాబ్ కార్డు స్టేటస్, అటెండెన్స్, పేమెంట్ వివరాలు మరియు ABPS (Aadhaar Based Payment System) సీడింగ్ ఎలా తనిఖీ చేసుకోవాలో చూద్దాం. --- ## VB G RAM G యాప్‌లో లభించే ముఖ్య సేవలు: * జాబ్ కార్డులో నమోదైన కుటుంబ సభ్యుల వివరాలు * ఆర్థిక సంవత్సరంలో మీరు పనిచేసిన మొత్తం పని దినాలు (Working Days) * రోజువారీ హాజరు మరియు మస్టర్ రోల్ (Muster Roll) స్టేటస్ * బ్యాంక్ ఖాతాలో జమ అయిన లేదా పెండింగ్‌లో ఉన్న పేమెంట్ వివరాలు * ABPS (Aadhaar Payment) మరియు e-KYC యాక్టివ్‌గా ఉందో లేదో తెలుసుకునే వెసులుబాటు --- ## 1. VB G RAM G యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం: 1. ముందుగా ప్లేస్టోర్ నుండి **V...

అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి

అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి    న్యూస్ పవర్  , 24 ఆగస్టు , ఇల్లంతకుంట : అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలనీ సామాజిక ఉద్యమ కారుడు,తెలంగాణ అంబేద్కర్ యువసేన  రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ అన్నారు, ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అంబేద్కర్ అభయహస్తం వెంటనే అమలు చేయాలి,ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ లకు  హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి   రాగానే అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు,ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు,రాహుల్ గాంధీ ,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  కలిసి ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్థం పథకం కింద రూ" 12 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించి, ప్రభుత్వం ఏర్పడి రెండు గడుస్తున్నా నేటికీ అమలు చేయకపోవడం అంబేద్కర్ ని అవమానపరచడమే అన్నారు,చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లో కాంగ్ర...

గీతాకార్మికులకు ఐడి కార్డులు పంపిణీ

గీతాకార్మికులకు ఐడి కార్డులు పంపిణీ   న్యూస్ పవర్ , 24 ఆగస్టు , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన 11మంది గీతా కార్మికులకు సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సి ఐ ఎం శ్రీనివాస్ సోమవారం గీతా కార్మికులకు పెన్షన్ దరఖాస్తుల కోసం గాను గీతా కార్మిక ఐడి కార్డులను పంపిణీ చేశారు అర్హులైన గీతా కార్మికులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన గీతకార్మిక సంఘ సభ్యులను కోరారు 50 సంవత్సరములు నిండిన గీతా కార్మికులు ఐడి కార్డ్ కలిగినటువంటి వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన గీతకార్మిక సభ్యులను కోరారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్  ఎ స్సై బత్తిని ప్రణీత్ గౌడ్ ఇల్లంతకుంట గౌడ సంఘ అధ్యక్షుడు కొయ్యడ రాజయ్య గౌడ్ ఉపాధ్యక్షుడు అంతటి రమేశ్ గౌడ్ కోశాధికారి ముంజ భాస్కర్ సారా రమేశ్ గౌడ్ కొయ్యడ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

నెల రోజుల్లో అనంతారం బిక్కవాగు బ్రిడ్జి పూర్తి చేయాలి

  ఇల్లంతకుంట: మండల పరిధిలోని అనంతారం గ్రామంలో గల బిక్కవాగుపై వంతెన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై అక్కెం నాగరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ‘ఎమ్మెల్యే ఆన్ వీల్స్’ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వంతెనను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని, కానీ నేటికీ ఆ హామీని నెరవేర్చకుండా పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేకు కేవలం గన్నేరువరం ప్రజలే ఓట్లు వేశారా, ఇల్లంతకుంట మండల ప్రజలు ఓట్లు వేయలేదా అని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. గన్నేరువరం సమస్యల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే, అదే చిత్తశుద్ధితో అనంతారం బిక్కవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం కూడా దీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గనుక దీక్షకు సిద్ధపడితే అందుకు కావాల్సిన ఫ్లెక్సీలు, పూలదండలు, ఇతర సామగ్రి ఖర్చులన్నింటినీ తానే స్వయంగా భరిస్తానని స్పష్టం చేశారు. వంతెన పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో బ్రిడ్జికి ఇరువైపులా నిత్యం తీవ్ర ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు అనంత...