Skip to main content

Posts

ఫెర్టిలైజర్ యాప్‌లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేక ఎరువుల కేటాయింపు చేయాలి

ఫెర్టిలైజర్ యాప్‌లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేక ఎరువుల కేటాయింపు చేయాలి   రాజన్న సిరిసిల్ల / ఇల్లంతకుంట: ఎరువుల విక్రయానికి సంబంధించిన ‘ఫెర్టిలైజర్ సేల్ యాప్’  లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేకంగా ఎరువుల కేటాయింపులు జరపాలని కోరుతూ మండల రైతు ప్రతినిధులు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి  కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం కీలకమైన వ్యవసాయ సీజన్‌లో యూరియా తగినంతగా లభించక ఇల్లంతకుంట మండల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెర్టిలైజర్ సేల్ యాప్ ద్వారా జరిగే పంపిణీ ప్రక్రియలో ప్రత్యేక విభజన లేకపోవడంతో, ఇల్లంతకుంట మండలానికి కేటాయించిన యూరియా నిల్వలను ఇతర మండలాల రైతులు కూడా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల మండల రైతుల కోసం కేటాయించిన యూరియా అతి తక్కువ సమయంలోనే నిండుకొని, స్థానిక రైతులు ఎరువులు దొరక్క అల్లాడిపోతున్నారని వివరించారు. మండలంలో రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, పంటల అవసరాలకు అనుగుణంగా యాప్‌లో ఇల్లంతకుంట మండలానికి ప్రత్యేక కేటాయింపు  చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి కోటాను ఇతరులు...

తల్లి జ్ఞాపకార్థం కుర్చీల వితరణ

  తల్లి జ్ఞాపకార్థం కుర్చీల వితరణ   న్యూస్ పవర్, 10 సెప్టెంబర్, ఇల్లంతకుంట: సమాజానికి తోడ్పాటు అందించడమే తల్లిదండ్రులకు ఇచ్చే నిజమైన నివాళి అని నిరూపించారు ఇల్లంతకుంట మండలం జవహరిపేట గ్రామానికి చెందిన ఎల రాజు తన  తల్లి ఎల మల్లవ్వ జ్ఞాపకార్థం గ్రామ ప్రజల సౌకర్యార్థం స్థానిక పల్లె దవాఖాన, గ్రామ పంచాయతీ కార్యాలయానికి కలిపి మొత్తం 20 కుర్చీలను ఆయన వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఎల రాజు మాట్లాడుతూ.. గ్రామంలోని పల్లె దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం గ్రామ పంచాయతీకి వచ్చే ప్రజలు కూర్చునేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ కుర్చీలను అందించినట్లు తెలిపారు. తన తల్లి జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలనే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంపెల్లి నాగరాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

బీఆర్ఎస్ నాయకుల అరెస్టు   న్యూస్ పవర్,  10 సెప్టెంబర్, ఇల్లంతకుంట: అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎండ్ర చందన్, గుంటి మధు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపు మేరకు   వారిని ముందస్తు అరెస్టు చేసి ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు , ఈ సందర్భంగా వారు మాట్లడుతూ  ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందనీ ఉద్యమ కారుల విద్యార్థుల నిరసన హక్కును అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు  విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా, నిరసనలకు ముందే అరెస్టులు చేయడం సరికాదనీ అరెస్టులు, నిర్బంధాలతో విద్యార్థుల ఉద్యమ కారుల గొంతుకను అణచలేరునీ విద్యార్థుల హక్కుల కోసం మా  పోరాటం నిరంతరం కొనసాగుతుందనీ తెలిపారు.

రాజన్న సిరిసిల్ల మినీ జాబ్ మేళా 2026: ప్రముఖ కార్ల డీలర్ సంస్థల్లో 90 ఉద్యోగాలు | Sircilla Mini Job Mela

  తెలంగాణ ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్‌షిప్ సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. జాబ్ మేళా ముఖ్యాంశాలు వివరాలు సమాచారం నిర్వహణ విభాగం జిల్లా ఉపాధి అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల మొత్తం ఖాళీలు 90 పోస్టులు ఉద్యోగ స్థానం (Job Location) హైదరాబాద్ (Hyderabad) ఇంటర్వ్యూ తేదీ & సమయం 11-09-2026 (శుక్రవారం), ఉదయం 11:00 గంటలకు వేదిక (Venue) రూమ్ నెం. F-16, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), కలెక్టరేట్, సిరిసిల్ల కంపెనీల వారీగా ఖాళీలు, అర్హతలు & జీతం వివరాలు 1. VVC Motors Pvt Ltd (Mahindra Car Dealer) పోస్టు పేరువిద్యార్హతవయోపరిమితివేతనం (నెలకు)ఖాళీలు సర్వీస్ టెక్నీషియన్ (Service Technician)ITI, Diploma, Inter pass18 - 26 సం.లు₹15,000 - ₹18,00015 సర్వీస్ అడ్వైజర్ (Service Advisor)Diploma / BE / B.Tech / Degre...

ఇల్లంతకుంట మండలంలో పెండింగ్ కాలువల పనులు తక్షణమే పూర్తి చేయాలి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య డిమాండ్

ఇల్లంతకుంట మండలంలో పెండింగ్ కాలువల పనులు తక్షణమే పూర్తి చేయాలి: బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య డిమాండ్ దాచారం (ఇల్లంతకుంట): దాచారం గ్రామంలో పెండింగ్‌లో ఉన్న 5 సాగునీటి కాలువల నిర్మాణ పనులను ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని బీజేపీ ఇల్లంతకుంట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దాచారంలోని ఈ ఐదు కాలువల పనులు పూర్తయితే రెండు మండలాల్లోని అనేక గ్రామాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.  * ఇల్లంతకుంట మండలం: దాచారం, బోటివానిపల్లి, సిరికొండ, తెలుగువారిపల్లి, పెద్ద లింగాపూర్, రామాజీపేట.  * తంగళ్ళపల్లి మండలం: చిన్న లింగాపూర్, జిల్లెల్ల, నర్సింహులపల్లె, బస్సాపూర్ తదితర గ్రామాలు. ఈ గ్రామాలన్నింటికీ సాగునీరు సక్రమంగా అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో మురుగు నీరు సక్రమంగా బయటకు వెళ్లే మా...

ఇల్లంతకుంట ప్యాక్స్ (PACS) పదవుల్లో మాదిగలకు తీరని అన్యాయం: అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు సావనపెల్లి రాకేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించడంలో దళితులకు, ముఖ్యంగా మాదిగలకు తీరని అన్యాయం చేసిందని అంబేద్కర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు సావనపెల్లి రాకేష్ మండిపడ్డారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం ప్రతి వర్గానికి సమన్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పొందుపరిచిన స్ఫూర్తిని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ తుంగలో తొక్కారని విమర్శించారు. ఎమ్మెల్యే అగ్రవర్ణ బడా నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ, రాజ్యాంగాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇల్లంతకుంట మండలంలో ఎస్సీ జనాభాలో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలకు ఇల్లంతకుంట ప్రాథమిక సహకార సంఘంలోని 12 నామినేటెడ్ పదవుల్లో ఒక్కటి కూడా కేటాయించకపోవడం అత్యంత బాధాకరమని, ఇది యావత్ మాదిగ జాతిని తీవ్రంగా అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మాదిగలపై సాగుతున్న ఈ రాజకీయ అణచివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 10న రౌండ్ టేబుల్...

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు  న్యూస్ పవర్  , 5 సెప్టెంబర్, ఇల్లంతకుంట:  ఇల్లంతకుంట  మండల కేంద్రంలోని వాణి నికేతన్ హైస్కూల్లో  ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణలో  శనివారం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలను వేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనది అన్నారు. దేశ భవిష్యత్తు  తరగతి గదులలోనే  రూపొందుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను  గౌరవించడం సామాజిక బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి, సుమంగళి, శోభ, మహాలక్ష్మి, సునంద, మౌనిక, కళ్యాణి, శమీమా, రేణుక, జలజ, శాంత, పద్మ, రేణుక, స్వాతి, సునీత, ఉష, లావణ్య తో పాటు  విద్యార్థులు పాల్గొన్నారు.