Skip to main content

Posts

తెలంగాణ బీసీ మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం | అర్హతలు, దరఖాస్తు వివరాలు

  తెలంగాణ బీసీ మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ: పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ (వెనుకబడిన తరగతుల) మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టింది. పేద, నిరుద్యోగ బీసీ మహిళలకు 100 శాతం ప్రభుత్వ సబ్సిడీతో ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, లక్ష్యాలు మరియు పంపిణీ ప్రణాళికను ఈ క్రింది వ్యాసంలో వివరంగా తెలుసుకుందాం. పథకం ముఖ్య అంశాలు (Scheme Highlights) | అంశం | వివరాలు | |---|---| | పథకం పేరు | ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం | | లబ్ధిదారులు | కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలు | | సబ్సిడీ | 100% ఉచితం (ప్రభుత్వ సబ్సిడీ) | | మొత్తం మిషన్ల సంఖ్య | 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు | | నియోజకవర్గానికి సంఖ్య | ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,000 మిషన్లు | | ప్రారంభ తేదీ & సమయం | ఆగస్టు 13 (గురువారం), మధ్యాహ్నం 12:00 గంటలకు | | ప్...

రాజన్న సిరిసిల్ల: చేయూత పెన్షన్ దరఖాస్తుల పూర్తి వివరాలు, అర్హతలు (ఆగస్టు 31 ఆఖరు)

  రాజన్న సిరిసిల్ల జిల్లా: చేయూత పెన్షన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'చేయూత పింఛన్ల' కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన వారు ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు కీలక సూచనలు చేశారు. దరఖాస్తు కేంద్రాల్లో వసతులు కల్పించడంతో పాటు, అవసరమైన పత్రాలపై దరఖాస్తుదారులకు పూర్తి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఏడు రకాల పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం మొత్తం ఏడు రకాల లబ్ధిదారుల కోసం ఈ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్లికేషన్‌ ఫారాలు జాగ్రత్తగా నింపి, ఆన్‌లైన్‌లో కూడా తప్పులు లేకుండా పూర్తి చేయాలి. సాధారణంగా ప్రతి దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు:  * ఆధార్ కార్డు  * వయసు ధ్రువీకరణ పత్రం (ఓటర్ కార్డు / జనన ధ్రువీకరణ పత్రం / విద్య...

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర న్యూస్ పవర్, 13 ఆగస్ట్, ఇల్లంతకుంట: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మంద అనిల్ కుమార్, సావనపెల్లి మల్లేశం ఆధ్వర్యంలో పొత్తూర్ బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్  హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంద సుదర్శన్ మాట్లాడుతూ... ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబోయే "బద్లావ్ జరూరీ హై" ( మార్పు అత్యవసరం) ర్యాలీలతో ముగుస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి. సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. అలాగే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలి. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి. మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ చ...

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి న్యూస్ పవర్ , 30 జూలై , ఇల్లంతకుంట: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ  ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు,    ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎడతెరిపి లేని వర్షాలు  ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు.   భారీ వర్షాలు కురుస్తుందున వల్ల  ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాలువలు వద్దకు  ఎవరు వెళ్లవద్దన్నారు.   ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, యువత వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు, కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. అలాగే విద్యుత్ పరికరాలను మరియు పోల్స్ కు దూరంగా ఉండాలి.విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలంచడానికి  పోలీసు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎటువంటి సహాయం కావాలన్నా  10...

తెలంగాణలో 'ఫ్యామిలీ రిజిస్టర్' విధానం ప్రారంభం: జీవో 172 జారీ | మీ సేవ ద్వారా సర్టిఫికెట్ పొందే పూర్తి వివరాలు

తెలంగాణలో 'ఫ్యామిలీ రిజిస్టర్' విధానం ప్రారంభం: జీవో 172 జారీ | మీ సేవ ద్వారా సర్టిఫికెట్ పొందే పూర్తి వివరాలు ​ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఒకే డిజిటల్ రికార్డులో నమోదు చేసేందుకు 'తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్' వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించి జీవో 172 (G.O. 172) ను విడుదల చేసింది. ​ఈ నూతన విధానం వల్ల ప్రభుత్వ సేవలు మరియు వివిధ ధృవీకరణ పత్రాలు పొందడం మరింత సులభతరం కానుంది. ​📌 తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ – ముఖ్యాంశాలు ​ ఒకే డిజిటల్ రికార్డు: కుటుంబ సభ్యులందరి పూర్తి సమాచారం ఒకే డిజిటల్ రికార్డులో నమోదవుతుంది. ​ సేవలు జారీ: మీ సేవ (MeeSeva) కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చు. ​ డేటా మూలం: ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (రేషన్ కార్డు) డేటాబేస్ ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తారు. ​ పరిమితి: ఇది కేవలం కుటుంబ సభ్యుల వివరాల అధికారిక రికార్డు మాత్రమే . ​📋 ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికె...

వాణినికేతన్ హై స్కూల్ లో ఘనంగా మెహందీ ఫెస్ట్

వాణినికేతన్ హై స్కూల్ లో ఘనంగా మెహందీ ఫెస్ట్  న్యూస్ పవర్, 24 జూలై , ఇల్లంతకుంట: విద్యార్థులలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన   మెహందీ ఫెస్ట్ - 2026 ఘనంగా జరిగింది. వాణినికేతన్ హై స్కూల్ ఆవరణలో శుక్రవారం చేతులకు గోరింటాకు మనసుకు సంతోషం అనే నినాదంతో   చేపట్టిన కార్యక్రమానికి విద్యార్థినీలు సంప్రదాయ దుస్తులలో హాజరై ఉత్సవంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్  తూముకుంట శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ విద్యతో పాటు, కళలు, సంస్కృతి సాంప్రదాయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, పోటీత్వాన్ని పెంపొందించడానికి పాఠశాలలో తరచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా విద్యార్థినీలు తమదైన శైలిలో వివిధ రీతుల గోరింటాకు డిజైన్లను రూపొందించి పోటీలో ఆసక్తిగా పాల్గొన్నారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయినీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక...

డ్రగ్స్ మహమ్మారికి యువత దూరంగా ఉండాలి

డ్రగ్స్ మహమ్మారికి యువత దూరంగా ఉండాలి • ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్  న్యూస్ పవర్ , 22 జూన్ , ఇల్లంతకుంట: యువత, విద్యార్థులు డ్రగ్స్ వంటి మహమ్మారులకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ పిలుపునిచ్చారు. సోమవారం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్  లో ఎస్సై  ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా 16 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు, యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడాల్సిన వయసులో ఇలాంటి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. రహీంఖాన్ పేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించినా లేదా వాడుతున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే ప్రభుత్వం కేటాయించిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. అలాగే విద్యార్థులు మెయిల్ ద్వారా...