గణతంత్ర దినోత్సవం నుంచి 4 నూతన పథకాల ప్రారంభం::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి • ప్రతి మండలంలో ఒక గ్రామంలో 4 పథకాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలి • ప్రారంభించు గ్రామాలలో ముందస్తుగా సీఎం సందేశం ప్రదర్శించాలి • నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిఎస్ ----------------------------------- రాజన్న సిరిసిల్ల, జనవరి 25: ----------------------------------- జనవరి 26 గణతంత్ర దినోత్సవ నుంచి 4 నూతన పథకాల అమలు ప్రారంభం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.శనివారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా *నూతన పథకాల ప్రారంభ ఏర్పాట్ల మాట్లాడుతూ,* గ్రామ, వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించినందుకు అధికారులకు ముందుగా అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, నూతన రేషన్ కార్డుల జారీ పథకాలను లాంఛనంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ని...