వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
న్యూస్ పవర్, 27 ఆగస్టు, ఇల్లంతకుంట:
మండల కేంద్రంలోని వాణినికేతన్ హైస్కూల్లో గురువారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులు ఉపాధ్యాయులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రజాప్రతినిధులు, అధికారులకు రాఖీలు కట్టారు.
ఫ్యాక్స్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ రాచకట్ల సురేష్, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మామిడి రాజుతో పాటు పాలకవర్గ సభ్యులకు, పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉపేంద్ర చారితో పాటు పోలీస్ సిబ్బందికి రాఖీలు కట్టారు. అలాగే ముస్కాన్పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, సహకార బ్యాంక్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులకు రాఖీలు కట్టి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నాచెల్లెళ్ల పవిత్ర అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని పేర్కొంటూ విద్యార్థులకు రక్షాబంధన్ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు రేణుక, సుమంగళి, శోభ, కళ్యాణి, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, జలజ, శాంత, పద్మ, సునీత, స్వాతి, ఉషారాణి, శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, తిరుపతిలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Comments
Post a Comment