సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర న్యూస్ పవర్, 13 ఆగస్ట్, ఇల్లంతకుంట: సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మంద అనిల్ కుమార్, సావనపెల్లి మల్లేశం ఆధ్వర్యంలో పొత్తూర్ బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద సుదర్శన్ మాట్లాడుతూ... ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబోయే "బద్లావ్ జరూరీ హై" ( మార్పు అత్యవసరం) ర్యాలీలతో ముగుస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి. సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. అలాగే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలి. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి. మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ చ...