Skip to main content

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర

సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర
న్యూస్ పవర్, 13 ఆగస్ట్, ఇల్లంతకుంట:
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మంద అనిల్ కుమార్, సావనపెల్లి మల్లేశం ఆధ్వర్యంలో పొత్తూర్ బ్రిడ్జ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్  హాజరయ్యారు. 
ఈ సందర్భంగా మంద సుదర్శన్ మాట్లాడుతూ... ఆగస్టు 6 నుండి 14 వరకు దేశవ్యాప్త రాజకీయ ప్రచారం పాదయాత్రలకు సిపిఐ పిలుపునిచ్చింది. ఈ పాదయాత్రలు 2026 సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరగబోయే "బద్లావ్ జరూరీ హై" ( మార్పు అత్యవసరం) ర్యాలీలతో ముగుస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగు ఈ పాదయాత్రలను సెప్టెంబర్ 1న మార్పు కోసం చలో ఢిల్లీ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పిలుపులో భాగంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి. సార్వత్రిక విద్య, ఆరోగ్యం అందుబాటులోకి తేవాలి. అలాగే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పించాలి. ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలి. మహిళా రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలి అన్నారు. బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అలాగే దళిత ఆదివాసీలపై దాడులను నిలిపివేయాలి. మహిళలలకు రక్షణ కల్పించాలి. నేడు భారతదేశంలో ఒక కీలకమైన మలుపులో నిలిచి ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ దశబ్దం క్రమంగా ఆందోళన నిరషా మరియు పెరుగుతున్న కష్టాలకు దారి తీసింది ఎన్నికల సందర్భంగా బిజెపి అభివృద్ధి ఉపాధి సంక్షేమం సుపరిపాలన మరియు మెరుగైన భవిష్యత్తును అందిస్తామని వాగ్దానం చేసింది కానీ దానికి బదులుగా దేశంలో నేడు పెరుగుతున్న నిరుద్యోగం భరించలేనీ ద్రవ్యోల్బణం ధరల పరుగుదల విస్తరిస్తున్న అసమానతలు బలహీనపడిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతున్న ప్రజాస్వామ్యం మరియు ప్రభుత్వం సామాజిక లను ఉద్రిక్తలను ఏరుకుంటుంది అయినాప్పటికీ మోదీ ప్రభుత్వం నుండి ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలని కోరినప్పుడల్లా ఈ చర్చను ఇతర అంశాల వైపునకు మళ్లిస్తున్నారు సామాన్య ప్రజలకు అన్యాయం చేస్తున్నారు మత విద్వేషాలతో యువతను ప్రజలను పక్కదారి పట్టిస్తూ కాలం గడుపుతున్న పరిస్థితి ఉందన్నారు. మొన్నటికి మొన్న నీటి పరీక్ష పేపర్ లింకుతో దేశమంతటా విద్యార్థులు ఆందోళనలతో జంతర్ మంతర్ వద్ద విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అలుపెరుగని పోరాటాలు చేస్తున్న విద్యార్థులపై దాడులు నాటి చార్జీలతో భయభ్రాంతులకు గురిచేసిన  ప్రభుత్వానికి భవిష్యత్తులో తగిన గుణపాఠం ఈ దేశ ప్రజలు మహిళలు యువత విద్యార్థులు బుద్ధి చెప్తారని తెలియజేశారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చడం కొరకు మోడీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా రాని ఈ సందర్భంగా తెలియజేశారు. దేశ ప్రజలకు అన్యాయం చేస్తే వామపక్ష పార్టీలుగా పోరాటంలో ముందుండి కొట్లాటకు సిద్ధపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  సీపీఐ జిల్లా నాయకులు భూంపెల్లి భూమిరెడ్డి, కాదురు మొండయ్య, పెండెల అధిత్య, గుంటి బక్కయ్య, గుంటి తిరుపతి, రాజయ్య, దొమ్మరి కనకయ్య, కోల వెంకటయ్య, గొట్లముక్కుల రాజయ్య, చిగుర్ల అనీల్, తోట్ల రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

   

Comments

Popular posts from this blog

ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్

  ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ ​ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట  విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ​ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...

నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి వార్నింగ్..

  నెల రోజులే గడువు.. లేదంటే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం! ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి  వార్నింగ్.. ఇల్లంతకుంట (న్యూస్ పవర్): మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యవహారశైలిని తప్పుబట్టారు.  34 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే స్పందించకపోవడం దారుణమని, పైగా దీక్ష చేస్తున్న రైతులను 'పిచ్చికుక్కలు' అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను అవమానించినందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎమ్మెల్యేకు కమీషన్లపై ఉన్న సోయి రైతుల సమస్యలపై లేదని, అసలు టీఎంసీ అంటే ఏమిటో, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయో కూడా తెలియని దుస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని రసమయి ఎద్దేవా చేశారు.  గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇల్లంతకుంట మండలంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని గుర్తు చేశారు. అన్నపూర్ణ రిజర్వాయర్ పూర్తి చేసి ఎర్రటి ఎండల్లో కూడా నీళ్లిచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేన...

రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం!

  రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారులకు శుభవార్త: ఐస్‌బాక్స్ మోటార్ సైకిళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం! రాజన్న సిరిసిల్ల: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐస్‌బాక్స్‌తో కూడిన మోటార్ సైకిళ్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా చేపల విక్రయానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని కల్పించి, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాకు కేటాయించిన యూనిట్ల వివరాలు: తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 500 యూనిట్లు మంజూరు కాగా, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 13 యూనిట్లు కేటాయించబడ్డాయి. వీటి విభజన ఈ క్రింది విధంగా ఉంది: సాధారణ వర్గం (General): 08 యూనిట్లు మహిళలు: 02 యూనిట్లు షెడ్యూల్డ్ కులాలు (SC): 02 యూనిట్లు షెడ్యూల్డ్ తెగలు (ST): 01 యూనిట్ మొత్తం: 13 యూనిట్లు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అర్హత కలిగిన మత్స్యకారులు తమ దరఖాస్తులను పూర్తి పత్రాలతో సమర్పించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి కమిటీ (DLC) ఈ దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. దరఖాస్తు గడువు: మార్చి 16, 2...