బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్.న్యూస్ పవర్ .06/22:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములో. ( ప్రభుత్వరంగ సంస్థ) లేబర్ కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ఎలక్ట్రిషన్. ప్లంబర్. మెషిన్. పెయింటర్. మొదలగునవి కోర్సుల నందు 15 రోజుల ఉచిత శిక్షణ ఇవ్వబడును. శిక్షణా కాలంలో ఉచిత భోజనం స్టేషనరీ.ఐటమ్స్. యూనిఫామ్. మరియు రోజుకు 300 రూపాయలు ఉపకార వేతనం ఇవ్వబడును. శిక్షణ అనంతరం ప్రభుత్వం వారిచే జారీ చేయబడు సర్టిఫికెట్ ఇవ్వబడును. & మహిళలకు ఉచితకుట్టు మిషన్ శిక్షణ. లేబర్ కార్డు ఉన్న వారి పైన ఆధారపడిన మహిళలకు మూడు నెలలు ఉచిత శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరం కుట్టుమిషన్ మరియు సర్టిఫికెట్ ఇవ్వబడును. (అడ్రస్ పాత సాహితీ స్కూల్ బిల్లింగ్.రాళ్ల భావి దగ్గర మహర్ బాబా గుడి ముందు శాంతి నగర్ రోడ్డు సిరిసిల్ల )వయసు 45 సంవత్సరాల లోపు ఉండాలి. చదువు అవసరం లేదు కానీ లేబర్ కార్డు కలిగి ఉండాలి. శిక్షణకు వచ్చేటప్పుడు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు. ఆధార్ కార్డ్. బ్యాంక్ ఖాతా. లేబర్ కార్డు జిరాక్స్. మూడు ఫోటోలు తీసుకొనివచ్చి సంప్రదించగలరు.ఫోన్ నంబర్.9866334841..8121141853
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్
ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ న్యూస్ పవర్, 12 మార్చి, ఇల్లంతకుంట విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇల్లంతకుంటలోని శ్రీవాణి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ (AISF) జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని వెంకటపూర్, తిప్పాపూర్ గ్రామ శివార్లలో సదరు పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బస్సు అతివేగంతో పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా మంద అనిల్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై పలు కీలక విమర్శలు చేశారు సదరు బస్సు డ్రైవర్ గతంలోనూ పలుమార్లు అతివేగంగా వాహనాన్ని నడుపుతూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని, ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాఠశాల భవనానికి చుట్టూ రక్షణ గోడ (ఫెన్సింగ్) లేకపోవడం, తరగతి గదులు ఇరుకుగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా...
Comments
Post a Comment