న్యూస్ పవర్ , 20 జూన్ , ఇల్లంతకుంట: వర్షాల కోసం కరుణించమని వానదేవుడిని వేడుకుంటూ,వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామం లోని అన్ని దేవాలయాల్లో మహిళలు జలాభిషే కాలు నిర్వహించారు. వర్షాలు లేక ఎండల తీవ్రత పెరిగి పొలాలు బీడు పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ ప్రజలు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వానదేవుడు కరుణించి, సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ ఉపాధి హామీ కూలీలు మహిళలు మాట్లాడుతూ, "వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో దైవ కృప కోసం అందరం కలిసి ఈ పూజలు చేశాం. వాన దేవుడు తమ మొర ఆలకించి, మంచి వర్షాలు కురిపిస్తాడని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.