బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ పవర్ రిపోర్టర్ :సాయిరాం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా రామకృష్ణాపుర్ వాస్తవ్యులు జేరిపోతుల అనసూర్య గారు చనిపోయి 9 నెలలు పూర్తి అయిన సందర్భంగా వారి కూతురు అల్లుడు కాంపల్లి శంకర్ రాజేశ్వరి గార్లు ఆదివారం  సాయంత్రం బెల్లంపల్లి లో అమ్మ శరణాలయంలో అనాధ పిల్లలకు మరియు యాచకులకు, మానసిక వికలాంగులకు, వృద్ధులకు, మరియు పేదవారికి అన్నదానం పంచడం జరిగిందని ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరిశంకర్ తెలిపారు. బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు మరియు బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు . అలాగే ఈ సేవా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ట్రస్టు వ్యవస్థాపకులు కాంపల్లి రాజేశ్వరి శంకర్, మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు గోనె శ్రీనివాస్,సాగల సదానందం, నల్ల శ్రీనివాస్,  మోటపలుకుల  తిరుపతి, బండారి శ్రీనివాస్ కొంక రవి  జక్కం తిరుపతి నాగమణి,  చంద్రకళ దుర్గం మారుతి, అశోక్, శ్రీకాంత్ సేవకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments