కోడెల కోసం ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి :: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
న్యూస్ పవర్ ,రాజన్న సిరిసిల్ల/వేములవాడ, జూన్ 01
వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలోని కోడెలను పొందుట కోసం రైతులు ఆన్లైన్లో జిల్లా వెబ్సైట్ https://rajannasircilla.telangana.gov.in/ నమోదు చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన రైతులకు మాత్రమే జియో ట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. అర్హులైన రైతులు పట్టాదారు పాస్ బుక్ ఆధార్ కార్డ్ మొదలగు సంబంధిత ధ్రువ పత్రాలతో ఈ వెబ్సైట్ https://rajannasircilla.telangana.gov.in/ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
జియో ట్యాగింగ్, వెబ్సైట్ లో రైతుల వివరాలు నమోదు చేయడంతో కోడెలు పక్కదారి పట్టే అవకాశం ఉండదని, భవిష్యత్తులో వాటి సంరక్షణను పరిశీలించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. కోడెలను తీసుకువెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూసుకోవాలని సూచించారు.
0 Comments