కరీంనగర్లో ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం.. బీసీ ద్రోహి అంటూ భగ్గుమన్న ముదిరాజ్ సంఘాలు!
కరీంనగర్: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా కరీంనగర్లో ముదిరాజ్ సంఘాలు భగ్గుమన్నాయి. ఆయన్ను 'బీసీ ద్రోహి'గా అభివర్ణిస్తూ పెద్దమ్మ తల్లి అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘం మరియు తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి (TMPS) ఆధ్వర్యంలో నగరంలోని గీత భవన్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన తీరుపై తమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
బీసీ బిడ్డకు అన్యాయం చేశారని ఆరోపణలు..
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల నేతలు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో జరిగిన ఎన్నికల్లో, బీసీ బిడ్డ అయిన నీలం కవిత-మధు ముదిరాజ్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆ సమయంలో ఎంపీ రఘునందన్ రావు, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే వాహనంలో వెళ్లి తన ఎక్స్-అఫీషియో (Ex-Officio) ఓటును వినియోగించుకోవడం బీసీ సమాజానికి తీరని అన్యాయం చేయడమేనని నాయకులు ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచిన ఒక ప్రజాప్రతినిధి, తిరిగి ఆ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. భవిష్యత్తులోనూ బీసీ హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు:
ఈ కార్యక్రమంలో జేఏసీ మరియు ముదిరాజ్ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జేఏసీ అధ్యక్షులు: చిక్కుడు రాజయ్య ముదిరాజ్
ప్రధాన కార్యదర్శి: నిమ్మల కిషన్ ముదిరాజ్
టీ.ఎం.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడు: కూనచ్చుల మహేందర్ ముదిరాజ్
జిల్లా కార్యదర్శి: ఎరవేణి రామాంజనేయులు
జిల్లా అధికార ప్రతినిధి: మౌటం సంపత్ ముదిరాజ్
ఇతర నాయకులు: బాలంకి మల్లేష్ ముదిరాజ్, పిల్లి రవి ముదిరాజ్, ఉపాధ్యక్షులు గుడ్డెలుగులా పోచయ్య, ఎన్.ఎం.ఆర్ శేఖర్, ఎరవేణి లక్ష్మణ్, తిప్పరవేణి స్వామి, మాచర్ల రమేష్, గరిగే రాజయ్య, కొత్తూరు రాజయ్య, జెట్టి సంపత్, జడగల శ్రీనివాస్, జెట్టి బాలయ్య, జెట్టి ప్రభాకర్, రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

