JSON Variables

మానకొండూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం

మానకొండూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం 
న్యూస్ పవర్ , 25 మే  , రాజన్న సిరిసిల్ల:
భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది, ఇట్టి సమావేశానికి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కుమ్మరి శంకర్  హాజరైనారు.ఈ సందర్భంగా కుమ్మరి శంకర్  మాట్లాడుతూ గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ  9 ఏండ్ల పాలనలో అన్ని రంగాలలో దేశం సుభిక్షితంగా సురక్షితంగా ముందుకు సాగుతుందని దేశ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలు సంక్షోభంలో కోరుకుపోయినా కూడా దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన అందించిన గొప్ప పరిపాలన దక్షకుడు నరేంద్ర మోడీ  అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం నిధుల వాటా లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఏ ఏ కార్యక్రమాలు చేసిందో చెప్పాలి అని నిలదీశారు. మానకొండూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. ప్రతి బిజెపి కార్యకర్త బిజెపి కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రతి ఇంటి ఇంటికి చేరేలా పని చేయాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలతో తెలంగాణ ప్రజానీకం అంత కూడ గద్దె దింపి బిజెపి పార్టీ పట్టం కట్టెందుకు సిద్ధంగా ఉన్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ, బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, ప్రధాన కార్యదర్శులు తిప్పారపు శ్రవణ్,సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ బత్తిని స్వామి, ఉపాధ్యక్షుడు భూమల్ల అనిల్, పున్ని రాజు,మ్యాకాల మల్లేశం శక్తి కేంద్రం ఇంచార్జ్ లు దేశెట్టి శ్రీనివాస్,పొన్నం కృష్ణ,అనగోని అవినాష్,లొంకోజ్ చంద్రం,చింతలపెల్లి రాజిరెడ్డి,చిమ్మనిగొట్టు శ్రీనివాస్,మామిడి హరీష్ , వజ్జేపెల్లి శ్రీకాంత్, కొలనూరు ముత్తక్క, గౌరవేని శ్రీకాంత్, మెరుగు నవీన్ గౌడ్, జెట్టి అరవింద్, దరిపెల్లి శంకర్,పోట్ల వెంకటేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments