JSON Variables

కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు

కాంగ్రెస్ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదు

న్యూస్ పవర్ , 23 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
కాంగ్రెస్ నాయకులకు లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని బీజేపీ సీనియర్ నాయకుడు మ్యాకల మల్లేశం విమర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లేశం మాట్లాడుతు ఆరు గ్యారెంటీల పెరితో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యిందని అన్నారు. అలాగే ఇచ్చిన హామీలకే సరిగ్గ దిక్కులేదు కానీ ఆగస్టు 15 లోపు రైతులకు ఎలా రుణమాఫీ చేస్తారని ఏద్దేవా చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో వేగం పెంచి త్వరగా వరి పంటను తూకం వేయాలని, ప్రతిరోజు రైతులు మారుతున్న వాతావరణ సూచనలతో బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని తెలిపారు. ఇప్పటికే సగం మంది రైతులు దళారులను నమ్మి పంటలను అమ్ముకున్నారని, ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు త్వరగా డబ్బులు జమ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments