న్యూస్ పవర్ , 28 ఫిబ్రవరి , ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎండి పోతున్న పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని రహీంఖాన్ పేట గ్రామ రైతులు రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నపూర్ణ ప్రాజెక్టు నుండి అనంతారం చెరువులకు నీటిని విడుదల చేయాలని వాగు ద్వారా రహీంఖాన్ పేట చెరువులోకి నీరు వస్తుంది అన్నారు నీరు లేక సుమారుగా 5 వందల ఎకరాల వరి పంట ఎండుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రెండు నెలల్లో మా గ్రామానికి నీరు అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని అన్నారు లేని పక్షంలో క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
0 Comments