JSON Variables

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా
న్యూస్ పవర్ , 24 ఫిబ్రవరి , ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం లబ్దదారులు రోడ్ పై బైటాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలోనే గ్రామ సభలో 32 మంది లబ్ధదారులను ఎంపిక చేశారని డబుల్ బెడ్ రూం లో మిగులు పనులు నీళ్ళు రోడ్ కరెంట్ ఇంకా పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని కిరాయి కట్టలేక కుటుంబ పోషణ పిల్లల చదువులు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు మా బాధను పట్టించుకోవడం పట్టించుకోవడంలేదని అన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపి త్వరగా మాకు ఇల్లు కేటాయించాలని కోరారు తర్వాత ఎమ్మార్వో కి వినతిపత్రం అందించారు .

Post a Comment

0 Comments