కోర్టుకు గైర్హాజరైన వ్యక్తికి రిమాండ్


కోర్టుకు గైర్హాజరైన వ్యక్తికి రిమాండ్


 న్యూస్ పవర్ , 4 నవంబర్ , ఇల్లంతకుంట :
కోర్టుకు గైర్హాజరైన వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు. మహిళను వేధిస్తున్నాడన్న విషయంలో  2017 లో మొగిలి సురేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు అవ్వగా ఇట్టి కేసులో నిందితుడు కోర్టుకు సరిగా హాజరుకానందున సిరిసిల్ల కోర్టు నాన్ బెయిలబుల్ వారంటూ జారీ చేయడంతో అట్టి వారంట్ పై కరీంనగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన మొగిలి.సురేష్ ని తీసుకువచ్చి కోర్టు ముందు హాజరు పర్చగా కోర్టు నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ కోర్టుకు సకాలంలో హాజరు కావాలని లేనిచో వారంట్ పై వారిని రిమాండ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Post a Comment

0 Comments