కమీషన్ ల కెసిఆర్ ను జేల్లో పెట్టాలి
• బీఎస్పీ అభ్యర్థి అడ్వకేట్ నిషాని రామచంద్రం
న్యూస్ పవర్ , 4 నవంబర్ , ఇల్లంతకుంట :
లక్ష కోట్ల తో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కుప్ప కులడానికి కెసిఆర్ అవినీతి కారణమని, కమీషన్ ల కెసిఆర్ ను జేల్లో పెట్టాలని సిద్దిపేట బాలకిషన్ ని తరిమికొట్టండి అని బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. లక్ష కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్న కల్వకుంట్ల కుటుంబమును జైల్లో పెట్టిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈ రోజు అనంతగిరి ,తిప్పాపూర్ గ్రామం లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట అనంతగిరి బహుజనుల ముత్యల పోచమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు అభ్యర్థించారు. 9 ఏండ్లలోఒక్క రేషన్ కార్డు ఇవ్వని, 5 ఏండ్లలో ఒక్క పెన్షన్ ఇవ్వని కనీసం ఒక్కో ఊరికి 10 ఇండ్లు కూడా కట్టించని బాలకిషన్ ని ఓడించి నన్ను గెలిపించండని అడ్వకేట్ నిషాని రామచంద్రం అన్నారు. అనంతగిరి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ప్రజలకు ఇంకా న్యాయం జరగలేదని అన్నారు. నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రతి ఇంటికి ఒక ఎకరం భూమి ఇప్పిస్తా అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేసి ఫామ్ హౌస్, వంద ఎకరాల భూమి, కోళ్ల ఫామ్ కట్టుకున్నాడని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీ లు ఒక్కటే అని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ లకు ఓటు అమ్ముకోవద్దని అన్నారు. ప్రజలకు. ఎన్నికల్లో. డబ్బులు. పంచె వారు మన బ్రతుకులు బాగు పరచ్చారని అన్నారు. అందుకే నేను మీ బ్రతుకులు బాగు చేయడానికి వచ్చాను కాబట్టి మీరే ఒక నోటు ఇచ్చి ఒక ఓటు ఇవ్వాలని అన్నారు. ప్రజలు స్పందించి ఒక నోటు ధర్మ నిధి లో వేస్తున్నారు అని అన్నారు
బహుజన రాజ్యం లో నిరుపేదలకు ఒక ఎకరం భూమి ఇస్తాం, బెల్ట్ షాప్ లు లేని తెలంగాణ ని చేస్తాం
ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తాం
ప్రతి మండలానికి అంతర్జాతీయ హాస్పిటల్ కట్టిస్తాం
ఐదు ఏండ్ల లో పది లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు.
మహిళలకు ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు.
రసమయి బాలకిషన్ దొరల పాలేరు అని అయన దొరల డబ్బులతో వస్తున్నాడని, నేను ప్రజల సేవకుడిని అని నాకు ప్రజలే డబ్బులు ఇవ్వాలని అన్నారు. అందుకు స్పందించిన ప్రజలు ప్రతి ఒక్కరు ఒక నోటు ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ మంద బాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల లింగయ్య, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నిషాని రాజమల్లు, మండల అధ్యక్షులు మంకాళి అమర్, మండల కోశాధికారి జుట్టు విజయ్ , బట్టు రవి, తిప్పాపూర్ బూత్ అధ్యక్షులు దమ్మని భూపతి , దమ్మని హరీష్, బీవీఎఫ్ కన్వినర్ శివ తదితరులు పాల్గొన్నారు.
0 Comments