కాంగ్రెస్ పార్టీలో చేరికలు
న్యూస్ పవర్, 5 నవంబర్ , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లె, ముస్కుపల్లె గ్రామలకు చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు, మహిళలు, యువకులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలు
కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని కోరారు.చేతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వుట్కురి వెంకట రమణ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాజీ యంపిపి, సర్పంచ్ లు,యంపిటిసిలు,ఉప సర్పంచ్ లు,వార్డ్ మెంబెర్ లు, మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
0 Comments