JSON Variables

యాభై క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కేసు నమోదు


యాభై క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కేసు నమోదు

న్యూస్ పవర్, 18 నవంబర్ , ఇల్లంతకుంట :
శనివారం రోజున ఇల్లంతకుంట మండల కేంద్రంలోపెట్రోలింగ్ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు. కూనవేని పల్లి గ్రామం నుండి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ సిబ్బందితో కలిసి కూనవేని పల్లి గ్రామం కు వెళ్లగా అక్కడ వానారాసి శ్రీనివాస్ అనే వ్యక్తి  ఒక ట్రాలీ ఆటో టీఎస్  12 యుడి 1924 లో కొన్ని రేషన్ బియ్యం కలిగయుండి అతని ఇంటిలో మరికొన్ని  మొత్తం 100 చిన్న సంచులలో దాదాపు 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం కలిగి ఉండడం తో అట్టి బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వనరాసి శ్రీనివాస్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ రేషన్ బియ్యం పట్టుకున్న వారిలో ఎస్సై. డి.సుధాకర్ తో పాటు సిబ్బంది సత్యనారాయణ, తిరుపతి,  శ్రీను ఉన్నారు.
మండలం లోని ఎక్కడ అయినా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినా,  యువకులు ప్రజలు వెంటనే పోలీసులకు100 నెంబర్ లేదా 8712656372 ద్వారా తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యoగా ఉంచుతామని ఇల్లంతకుంట ఎస్సై సుధాకర్ తెలిపారు.


Post a Comment

0 Comments