JSON Variables

కరాటేలో రాణించిన వాణీనికేతన్ విద్యార్థులు

కరాటేలో రాణించిన వాణీనికేతన్ విద్యార్థులు

జనం న్యూస్ , 20 నవంబర్ , ఇల్లంతకుంట :
 ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్స్ 2023లో వాణీనికేతన్ హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.  కరీంనగర్ లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలలో కటా ఈవెంట్ లో వరుణ్ రాజ్ రజతపతకాన్ని, గణేష్ కాంస్య పతాకాన్ని సాధించారు. కెట్ ఈవెంట్ లో కౌషిక్ కుమార్  కాంస్య పతాకాన్ని అందుకున్నాడు. పాఠశాల ఆవరణలో సోమవారం ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు అభినందన సమావేశం జరిగింది. కార్యక్రంలో కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనిధి, కరాటే మాస్టర్ శరత్ లతో పాటు ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments