JSON Variables

అంగట్లో పశువులను కొన్నట్టు కొంటున్నారు



  అంగట్లో పశువులను కొన్నట్టు కొంటున్నారు
   • రసమయి బాలకిషన్
    
 న్యూస్ పవర్ , 27 నవంబర్ , ఇల్లంతకుంట :
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి,సిరికొండ,తెనుగువానిపల్లె,మేమానకొండూర్  బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి  రసమయి బాలకిషన్  ప్రచారం నిర్వహింగా ఆయా గ్రామాల ప్రజలు డప్పు చప్పుల్లతో మహీళలు బోనాలతో యువత క్రేన్ సహాయంతో భారీ గజ మలతో స్వాగతం పలికారు 
అనంతరం రసమయి మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే ప్రజల బ్రతుకులను ఆగం చేస్తారని అన్నారు.కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో ప్రజలను పీక్కుతింటున్నారని అన్నారు.ఎన్నికలంటే ఓట్ల పండుగ కాదని ప్రజల ఐదేళ్ల భవిష్యత్తు అని అన్నారు.హైదరాబాద్ లో ఆస్పత్రులు పెట్టి దొచుకున్న డబ్బులను ఇక్కడకు వచ్చి  నాయకులను డబ్బు సంచులతో కొనాలని చూస్తున్నారు. కానీ  మానకొండూర్ నియోజకవర్గ ప్రజలను కొనలేరని, ప్రజలంతా రసమయి బాలకిషన్ వెంటే ఉన్నారని అన్నారు.అనంతగిరి భూనిర్వాసితులకు రావాల్సిన ప్యాకేజీ డబ్బులు, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎన్నికలు కాగానే తప్పకుండా పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. మానకొండూర్ నియోజకవర్గములోని ప్రతి దళిత కుటుంబానికి హుజురాబాద్ మాదిరిగా దలితబంధు పథకం అమలు చేస్తామని అన్నారు.
కేసీఆర్ రాకముందు వ్యవసాయం దండగ అన్నారు. పిల్లను కూడా ఇచ్చేటోళ్లు కాదు. మందు బస్తాలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టిన దుస్థితి. పెట్టుబడి సాయం కావాలంటే 3 రూపాయలు,ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకున్నం.
కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చిండు. పెట్టుబడి ఇచ్చిండు. చెరువులు మంచిగ చేసిండు. నీళ్లు ఇచ్చిండు. విత్తనాలు ఇచ్చిండు. పంట పండిన తర్వాత గింజ వదలకుండా కాంటాలు పెట్టి కొన్నడని అన్నారు.నాటి సమైక్య పాలనలో కూలీ పనులు దొరకడం లేదని చెప్పేటోళ్లు. కానీ ఇప్పుడు కూలోళ్లు దొరకుతలేరని అంటున్నరు. వేరే రాష్ట్రాల నుంచి మగవాళ్లు వచ్చి వరి నాట్లు వేస్తున్నరని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుకు సాయం చేయలేదు_. _రైతు దగ్గరే డబ్బు వసూలు చేసిండ్రు. కానీ రైతుకే తిరిగి డబ్బు ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రైతు బంధును కాపీ కొట్టిండ్రు._ _కాంగ్రెసోళ్లు రైతుకు 15 వేలు ఇస్తమంటున్నరు. కానీ కేసీఆర్ మాత్రం ఎకరాకు 16 వేలు ఇస్త అంటున్నడు. కాంగ్రెస్ మోసాన్ని రైతులు గ్రహించాలని అన్నారు
కర్ణాటక రైతులు మోసపోయినట్టు తెలంగాణ రైతులు ఆగం కావద్దు.కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతు బంధుకు ఎగనామం పెట్టిందని అన్నారు.
ఐదు గ్యారంటీల్లో యువశక్తి పథకం ఇంకా ప్రారంభించలేదని కారణం ఏంటంటే ఖజానా ఖాళీ అని చెప్తున్నరని అన్నారు.కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తుంటే కర్ణాటకలో రూపాయి కూడా ఇవ్వట్లేదని 2 వేల పింఛన్ను కేసీఆర్ 5 వేలు ఇస్తాడని అన్నారు.కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ఇస్తానని కేసీఆర్ చెప్తుండని అన్నారు. మూడో సారి గెలిస్తే అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తాం. బీజేపీ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరని తగ్గించి రూ. 400 కే ఇస్తాం
మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సౌభాగ్య లక్ష్మి అనే కొత్త పథకాన్ని తీసుకొస్తున్నారు. ప్రతీనెలా 3 వేల రూపాయలను వారి బ్యాంకు అకౌంటులో వేయాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు.భూమి ఉన్న వారికి రైతు బంధు పెంపు, లేని వారికి 5 లక్షల బీమా అమలు చేస్తాం.కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు దేవుడెరుగు కానీ ఆర్నెల్లకు ఒక సీఎం మారుడు మాత్రం పక్కా అన్నారు.

Post a Comment

0 Comments