కాంగ్రెస్ పార్టీలో చేరికలు
న్యూస్ పవర్ , 12 నవంబర్ , ఇల్లంతకుంట :
కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతుంది ఆదివారం మాజీ వైస్ ఎంపీపీ దొంతి మల్లయ్య , ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజిరెడ్డి , బీఎస్పీ మండల ఉపాధ్యక్షులు దేవరాజ్ , సోమారంపేట మాజీ సర్పంచ్ వెంకట చారి వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్, ఎల్లం గౌడ్ చేరారు వివిధ గ్రామాల వార్డు సభ్యులు, యువజన సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చేరగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆహ్వానించారు . రోజురోజుకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజా ఆధారణ చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గెలిపించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎంపీపీ వుట్కూరివెంకట రమణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు భూంపెల్లి రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, అనుబంధ సంఘాల మండల అధ్యక్షుడు, పలువురు మండల నాయకులు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments