JSON Variables

రెండు ఇసుకు ట్రాక్టర్ ల పట్టివేత కేసు నమోదు


రెండు ఇసుకు ట్రాక్టర్ ల పట్టివేత కేసు నమోదు
 న్యూస్ పవర్ , 18 అక్టోబర్ , ఇల్లంతకుంట :
శుక్రవారం మరియు శనివారం ఇల్లంతకుంట మండలంలోని పొత్తుర్, తిప్పాపుర్ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు అని సమాచారం రావడంతో ఇల్లంతకుంట ఎస్సై.డి.సుధాకర్, సిబ్బంది సత్యనారాయణ,భూమయ్య, శ్రీనివాస్, శ్రీకాంత్ తో కలిసి వెళ్లి  అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న  రెండు ట్రాక్టర్ లను సీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా  పొత్త్తుర్ , తిప్పపూర్, వాగు నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ల యజమానులు తోడేటి. సతీష్, బత్తిని.శ్రవణ్ లపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిందితులు ఎంతవారాలైన ఉపేక్షించబోమని ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా సమాచారం సేకరించిన కానిస్టేబుల్ లను ఎసై అభినందించారు.
మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

Post a Comment

0 Comments