JSON Variables

దాచారం గ్రామంలో గడప గడప కి బీజేపీ

దాచారం గ్రామంలో  గడప గడప కి బీజేపీ
 న్యూస్ పవర్ , 28 అక్టోబర్ , ఇల్లంతకుంట :
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెపల్లి మోహన్ గెలుపే లక్ష్యంగా ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని దాచారం గ్రామంలో గడప గడప కి బీజేపీ కార్యక్రమంతో బీజేపీ మండల అద్యక్షుడు నాగసముద్రాల సంతోష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి బీజేపీ పార్టీ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, విజయాలను విస్తృతంగా ప్రచారం చేశారు. అవినీతి రాజకీయాలకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ప్రభుత్వ పాలన పై వ్యతిరేకత, గత ప్రభుత్వ పాలన పై స్కాం లతో విసుగు చెందిన ప్రజలు మోడీ నాయకత్వంలో తెలంగాణ లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అమలుగాని హామీలతో, మాయ మాటలు చెప్పే పార్టీలను గుర్తించి రానున్న ఎన్నికల్లో ఓటు తో బుద్ధి చెప్పాలని గ్రామస్తులను కోరారు.
 మానకొండూర్ నియోజక వర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అరెపల్లె మోహన్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మోర్చా భాద్యులు, సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జి, బూత్ కన్వీనర్లు చెప్యాల గంగాధర్, సూదుల కిషన్,కుడుముల శ్రీహరి,పొన్నం కృష్ణ, ఎల్లంకి శ్రీనివాస్, కరచి మహేందర్,జాప శ్రీనివాస్, కట్కూరి తిరుపతి,ఉప్పల జీవన్, బండమీది బాల్ రెడ్డి, మరవేణి శ్రీశైలం, సరిగే మల్లేశం, రగడ లింగయ్య, రగడ దేవరాజు,సలెద్రి అజయ్, కోడిముంజ రమేష్, గౌరవేని పర్శారాములు,ఉప్పల లక్ష్మారెడ్డి,చిర్లవంచ బాల్ రెడ్డి,నరిగే మహేందర్,కారకవేని బాబు,జక్కుల నవీన్, మిందే అశోక్, కంచి పర్శారాం,అంబటి శ్రీనివాస్, మారవేని పర్శారాములు, దురుమిట్ల రమేష్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments