ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం
ఇల్లంతకుంట మండలం
కందికట్కూరు గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు
గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
కందికట్కుర్ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు
అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు
ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని,దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని,ఇంటికో ఉద్యోగం ఇస్తామని,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు
రైతులు అరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మిల్లర్ల క్వింటాలుకు 5 నుండి 10 కిలోల వరకు కటింగ్ పేరిట దోపిడీ చేసిన ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కనీసం నష్ట పరిహారం కూడా అందించని ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలన్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం 5వందలకే సిలిండర్,రైతులకి క్వింటాలుకు అదనంగా 500 రూపాయల బోనస్ ,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,ఆరోగ్యశ్రీ పరిధి పెంపు,ప్రతి మహిళకు చేయూత కింద 4వేల రూపాయల ఆర్థిక సహాయం ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని,ప్రతి ఒక్కరు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు , సర్పంచులు, ఎంపీటీసీలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments