రోడ్డు బాగు చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
• చినుకు పడితే వారం రోజులు అయినా తగ్గకుండా మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ
•బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక నిత్యం ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది
• ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ లేక దొంగలు పడి ఫర్నిచర్ ఇతర సామగ్రి ధ్వంసం
• ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు
న్యూస్ పవర్ , 13 సెప్టెంబర్ , ఇల్లంతకుంట :
ఏబీవీపీ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలి అని ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కు వెళ్లే ప్రధాన రోడ్డు విద్యార్థులు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందిగా ఉంది చినుకు పడితే వారం రోజులు అయినా తగ్గకుండా దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు నిలువ ఉండి నిత్యం ప్రజలకు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది అలాగే అనంతారం బిక్క వాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మిచ్చకపోవడంతో ప్రజలకు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల కు ప్రహరీ గోడ లేక అందులో దొంగలు పడి ఫర్నిచర్ ఇతర సామగ్రి ధ్వంసం చేసారు అలాగే విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు
ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్ కూనబోయిన ప్రవీణ్,అవినాష్ , కిరణ్, సాయి, సమీర్,దినేష్, విజయ్, రామ్ చరణ్, ప్రవీణ్, నాగరాజు, వినయ్, నవీన్, అరవింద్, రాకేష్ విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments