పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్ లను వేసిన వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్

పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్ లను వేసిన  వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ 
జనం న్యూస్, 3ఆగస్టు , ఇల్లంతకుంట :
నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలు డాక్టర్ శరణ్య , డాక్టర్  కట్ట రమేష్ లతో కలిసి  పంపిణీ  చేసిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి.పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ఈ సందర్భంగా  శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరముల పిల్లలు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు.. నులి పురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత , పౌష్టికాహార లోపం , బలహీనత , కడుపునొప్పి లక్షణాలు ఉంటాయని అన్నారు.. అందుకే ప్రతి ఒక్క చిన్నారి అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని అన్నారు... ఈ కార్యక్రమంలో డాక్టర్ శరణ్య , డాక్టర్ కట్ట రమేష్, సూపర్వైజర్ నయీం , ఏ ఎన్ ఎం జ్యోతి ఆశా కార్యకర్తలు పద్మ విజయ సౌమ్య, అంగన్వాడీ కార్యకర్తలు పద్మశ్రీ, విజయలక్ష్మి మరియు చిన్నారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments