JSON Variables

జంగారెడ్డి పల్లి గ్రామంలో స్వచ్ఛభారత్ గ్రామ సభ

జంగారెడ్డి పల్లి గ్రామంలో స్వచ్ఛభారత్ గ్రామ సభ

•పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
• సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి 

న్యూస్ పవర్ , 25 ఆగస్టు , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ తూముకుంట శ్రీలత నరేందర్ రెడ్డి  అధ్యక్షతన  స్వచ్ఛభారత్ గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాడిన నీటిని  ఇంకుడు గుంతలోకి వెళ్లే విధంగా చూడాలని, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్ కు అందజేసి కంపోస్ట్ షెడ్ కు తరలించాలని సూచించారు మరియు ప్లాస్టిక్ ను వాడకుండా బట్ట సంచులను ఉపయోగించుకోవాలని తెలియజేశారు అదేవిధంగా గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా డిక్లేర్ చేసుకుందామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లయ్య వార్డు సభ్యులు నారాయణ రాజలింగం పద్మ, కో ఆప్షన్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి , వెంకటవ్వ, పంచాయతీ కార్యదర్శి మధు, సి ఏ రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ రమ, అంగన్వాడి టీచర్ వర్ష ,ఆశ వర్కర్ అరుణ, మహిళా సంఘ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments