భారతీయ జనతా పార్టీ లోకి చేరిన బిఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు గైని శ్రీనివాస్
భారతీయ జనతా పార్టీ నియోజకవర్గస్థాయి ఎమ్మెల్యే ప్రభాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన సోమారంపేట గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు గైని శ్రీనివాస్ ని అస్సాం ఎమ్మెల్యే దిగంతా కలిత బీజేపీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు .ఈ సందర్భంగా ఈ రోజున మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, శక్తి కేంద్రం ఇంచార్జ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు పుణ్ణి సంపత్, మండల అధికార ప్రతినిధి పుణ్ణి రాజు, బూత్ అధ్యక్షుడు మేక శ్రీనివాస్ లు గైని శ్రీనివాస్ గృహంలో శాలువతో సత్కరించారు. తదనంతరం గైని శ్రీనివాస్ తను గతంలో బీజేపీ కార్యకర్తగా పని చేశానని తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో తెరాస చేరి అప్పటి నుండి నిన్నటి వరకు పార్టీ లో పని చేశాను అని తెలిపారు. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాబందుల చేతుల్లో పడింది అని తెరాస పాలనలో అవినీతి, అరాచకాలతో తెలంగాణ ప్రజానీకం విసుగెత్తి పోయారు అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర గ్రామాల అభివృద్ధి కి మోడీ ప్రభుత్వం ఎంతగానో దోహదపడుతుంది అని తెలంగాణ ద్రోహుల పార్టీ తెరాసా పార్టీ అని ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటున్న పార్టీ బీజేపీ పార్టీ అని రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ గెలుపు కాయం అని అన్నారు.
0 Comments