JSON Variables

వైన్స్ ల మీద ఉన్న శ్రద్ధ గృహ లక్ష్మి పథకంపై లేదు

వైన్స్ ల మీద ఉన్న శ్రద్ధ గృహ లక్ష్మి పథకంపై లేదు

న్యూస్ పవర్, 20 ఆగస్టు , ఇల్లంతకుంట :
 గృహ లక్ష్మీ పథకం అర్హులందరికీ అందించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు మ్యాకల మల్లేశం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైన్స్ టెండర్ల మీద ఉన్న శ్రద్ద మిగితా పథకాల పై లేదని ఆరోపించారు. వైన్స్ టెండర్లకు ఇచ్చిన సమయం గృహ లక్ష్మీ పథకానికి ఇవ్వలేదని, వచ్చేది ఎన్నిక సమయం కాబట్టి ప్రజలకు ఇలాంటి ఉచిత పథకాలు ఆశ చూపి సోమరిపోతుల్ని చేయమే కాకుండా ప్రజా ధనాన్ని వృధా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Post a Comment

0 Comments