JSON Variables

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు 

న్యూస్ పవర్ , 14 జూలై , ఇల్లంతకుంట :
భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగింది  ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  డాక్టర్ కుమ్మరి శంకర్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను పదేపదే మోసం చేస్తూ దళిత ద్రోహి ప్రభుత్వం గా మారిందని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆశలకు ఆశయాలకు తూట్లు పొడుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బి.ఆర్.ఎస్ పార్టీ ఎస్సీ కులాల అభివృద్ధిని అంకల్లో చూపిస్తూ ఉండడానికి పెంకుటిల్లును సైతం ఇవ్వడం లేదు అన్నారు దళిత బంధు పేరు పేపర్లలో ఉంటుంది కానీ పేద ఎస్సీ జీవితాల్లోకి వచ్చి వెలుగులు నింపటం లేదని అబద్దపు హామీలతో ఈ బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీలను ఆశల పల్లకిపై తింపుతూ ఉందని తప్ప దళిత సమాజానికి చేసింది శూన్యం అని అన్నారు , దళిత బంధు పథకాన్ని పక్షపాతం లేకుండా కలెక్టర్  ఆధ్వర్యంలో పూర్తి ప్రక్రియ జరపాలని, అర్హులైన పేద ఎస్సీ లందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు అందివ్వాలని, డప్పు కొట్టే వారికి చెప్పులు కుట్టుకునే వారికి 5000/-రూపాయలు పెన్షన్ అమలు చేయాలని  ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్,మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్,దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు కట్కూరి తిరుపతి,బిజెపి మండల ఉపాధ్యక్షులు కామర్ల ఎల్లయ్య, గుంటి మహేష్, మండల అధికార ప్రతినిధి భూమళ్ళ ప్రశాంత్, కొలనూరు ముత్తక్క, శక్తి కేంద్రం ఇంచార్జ్ లు దేశెట్టి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బత్తిని సాయి గౌడ్, గుగ్గిళ్ళ ఆంజనేయులు, బూత్ అధ్యక్షులు రంగు రమేష్ జంగిటి అజయ్, కంచ మహేందర్,కుడుముల శ్రీహరి, నాయకులు వజపల్లి శ్రీకాంత్, అంతటి వేణు, ఎల్లంకి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments