JSON Variables

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
న్యూస్ పవర్ , 20 జూలై , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ జెఎసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె లో భాగంగా  15వ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రము లో రాస్తారోకో నిర్వహించారు,  మండల అధ్యక్షుడు వర్కోలు మల్లయ్య మాట్లాడుతూ మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి, గత 15 రోజులుగా సమ్మెలో చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ కార్మికులు జీతాలు లేక పస్తులు ఉంటున్నారనీ ఇతర పనులకు వెళ్తున్నారు మేము సమ్మెలో ఉంటే మీరు ప్రైవేట్ వ్యక్తులకు రోజుకు 500 రూపాయలు ఇచ్చి పని చేపించుకుంటున్నారు అదే డబ్బులు మేము ఇవ్వమంటున్నాము వాళ్లకో న్యాయమా మకో న్యాయమా అన్నారు, మాకు 19500 జీతం , ఉద్యోగ భద్రత కల్పించమని కోరారు,
ఈ కార్యక్రమంలో  కోశాధికారి నల్ల చందన రూప బాబు కిరణ్ మహేందర్ రవి కిరణ్ బాబు మరియు అన్ని గ్రామాల్లోని కార్మికులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments