JSON Variables

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
న్యూస్ పవర్ , 12 జూలై , ఇల్లంతకుంట :
నిన్న రేవంత్ రెడ్డి  చేసిన వాక్యాలను వక్రీకరించిన బిఆర్ ఎస్ పార్టీ తీరును నిరసిస్తూ ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసిఆర్ చిత్రపటాన్ని రోడ్డు పై ఉరేగేస్తు దహనం చేయడం జరిగింది,
ఉచిత కరెంటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, ఉచితాల పేరుతో విద్యుత్ సంస్థల వద్ద టిఆర్ఎస్ ప్రభుత్వం వసూలు చేసే కమీషన్లకు  మా పార్టీ వ్యతిరేకం రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం జలయజ్ఞమే  ధనయజ్ఞంగా పనిచేస్తుంది తప్పా రైతుల పక్షపాతాన నిలవడం లేదు. కాలేశ్వరం పేరుతో లక్షల ఎకరాలు సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం, కాలేశ్వరం బ్యాక్ వాటర్, ముంపు ప్రాంతాల ప్రజల రైతులకు అందించిన నష్టపరిహారం ఎంతో ప్రజలకు తెలపాలి. తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వచ్చిన రైతులకు బేడీలు వేసి కోర్టుల తీర్చడమేనా  రైతు పక్షపాతి అని చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పని
రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ  24 గంటల ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఏకకాలంలో  రైతు రుణమాఫీ చేసింది  కాంగ్రెస్ పార్టీయే తప్పా బిఆర్ఎస్ ప్రభుత్వం కాదు.
రాష్ట్రంలోని 95% ఉన్న చిన్న, సన్న కారు  రైతులను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి గంట చొప్పున  8 ఎకరాలకు ఎనిమిది గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని చెప్పిన మా నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం సబ్ స్టేషన్ల ముందు ధర్నా పేరుతో నీచ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటు
 ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ, బిఆర్ఎస్ నాయకుల కుట్రలు, కుతంత్రాలను  గుర్తించి  రైతు పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.

Post a Comment

0 Comments