JSON Variables

రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ సభ్యులకు సిఆర్పి పై అవగాహన కార్యక్రమము

రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ సభ్యులకు సిఆర్పి పై అవగాహన కార్యక్రమము
శనార్తి తెలంగాణ, రాజన్న సిరిసిల్ల:
జిల్లాలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ సభ్యులకు ఈ రోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈల్లంతకుంట పోలీస్ వారి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ సభ్యులకు సి అర్ పి మీద  అవగాహన కల్పించడం జరిగిందని ఎస్.ఐ రాజేష్ తెలిపారు,
ఈ సందర్భంగా ఎస్.ఐ రాజేష్ మాట్లాడుతూ..
రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ సభ్యులకు  రోడ్డు భద్రతా నియమాలు,ట్రాఫిక్ రూల్స్ పై ,ప్రమాదాలు నివారించడం కొరకు చేపట్టబోయే చర్యలు సంబంధిత విషయాలపై అవగాహన కల్పించి,మీ మీ గ్రామాల్లో అందరికీ రోడ్ భద్రత మీద అవహన కలిపించాలని కమిటీ సభ్యులు కోరారు.వాహనదారులలో /ప్రజలలో ట్రాఫిక్‌ నియమాలపై అవగాహాన కల్పించడం ద్వారా ప్రమాదాల నివారణకు  కృషి చేద్దాం అని అన్నారు.రహదారి భద్రతపై మరింత అవగాహనను పెంపొందించుకోవలని,ప్రమాదాలు చెప్పి రావని ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్‌ వాడాలని, మద్యం తాగి వాహనాలు నడపకుడదు అని,  క్రమశిక్షణ పాటించాలని సూచించారు, ఈ కార్యక్రమము లో వైద్యులు కట్ట రమేష్ , శరణ్యా, పోలీస్ శాఖ సిబ్బదితోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోడ్ సేఫ్టీ విలేజ్ కమిటీ సభ్యులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments