హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
న్యూస్ పవర్ , 30 మే , ఇల్లంతకుంట :
తేది:29-05-2023 రోజున గొల్లపల్లి సుగుణ,భర్త కనకయ్య,కులం కుమ్మరి, నివాసం జిల్లెల్ల గ్రామం తంగళ్ళపల్లి మండలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన అన్న ఐన దరిపెల్లి శంకర్ వయస్సు 51 సం. లు r/o దాచారం గ్రామం ఇల్లంతకుంట మండలంను హత్య చేసినారు అని మృతుని యొక్క చెల్లె ఇచ్చిన ధరఖాస్తు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ నందు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా సిద్దిపేట మండలానికి చెందిన చంద్రకళ తో దాచారం గ్రామానికి చెందిన దరిపల్లి శంకర్ తో 27 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది, వీరికి ఇద్దరు కూతుళ్ళు , ఒక కుమారుడు కలరు ఇద్దరి కూతుళ్లకు పెళ్లిళ్లు జరిగినవి ఈ మద్యనే రెండవ కూతురి వివాహం జరిగినది.అర్థ రాత్రి అనగా తేది 28-05-2023 రోజున మృతుడు దరిపల్లి శంకర్ మద్యం మత్తులో ఉన్న సమయంలో మృతుని బార్య ఐన దరిపల్లి చంద్రకళ , కుమారుడైన దరిపెల్లి వంశీకృష్ణ @ వంశీ లు కుటుంబ కలహాలు , ఆస్తి కోసం మృతుడు దరిపల్లి శంకర్ ని నిద్రిస్తున్న సమయంలో అతని బార్య దరిపల్లి చంద్రకళ , కుమారుడైన వంశీ లు కలసి కత్తితో పొడిచి గొంతునులిమి చంపినారు అని మృతుడి యొక్క చెల్లి ఐన గొల్లపల్లి సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరస్తులైన దరిపల్లి చంద్రకళ , దరిపెల్లి వంశీకృష్ణ@వంశీలపై ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 139/2023 U/S 120-బ,302,201 r/w 34 ఐపిసి గా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగినది.ఇట్టి కేసులో నేరస్తులను తేది 30-05-2023 నా దాచారం వారి ఇంట్లో ఉన్నారన్న సమాచారంతో నేరస్తులైన మృతుని బార్య దరిపల్లి చంద్రకళ ,కుమారుడైన వంశీ కృష్ణ @ వంశీ లను పట్టుకొని పంచుల సమక్ష్యంలో విచారించగా మృతుని బార్య ఐన దరిపల్లి చంద్రకళ , కుమారుడైన దరిపెల్లి వంశీకృష్ణ @ వంశీ లు కుటుంబ కలహాలు మరియు ఆస్తి కోసం మృతుడు దరిపల్లి శంకర్ ని నిద్రిస్తున్న సమయంలో అతని బార్య దరిపల్లి చంద్రకళ , కుమారుడైన వంశీ లు కలసి కత్తితో పొడిచి గొంతునులిమి చంపినారు అని తెలిపినారు. వారు ఇట్టి నేరానికి ఉపయోగించిన వస్తువులను స్వాదిన పరుచుకొని నేరస్తులను గౌరవ కోర్ట్ నందు హాజరు పరచటం జరిగినదనీ ఇల్లంతకుంట ఎస్.ఐ రాజేష్ తో కలసి రూరల్ సి.ఐ ఉపేందర్ తెలిపారు.
0 Comments