JSON Variables

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈ దశాబ్ది ఉత్సవాలు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం వల్లనే ఈ దశాబ్ది ఉత్సవాలు

-రాష్ట్రం ఏర్పడి దశాబ్దం కావస్తున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరక పోవడం భాదకరం. 

-మానకోండుర్ యువజన నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షడు అంతగిరి వినయ్ కుమార్. 

న్యూస్ పవర్ , 31 మే , ఇల్లంతకుంట :
నేడు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ కళ సాకరమై దశాబ్దం కావస్తున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ యస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.అమరుల త్యాగాలను గుర్తించి 60ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది సోనియా గాంధీది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి నిధులు రాలేదని పదే పదే చెప్పే శాసనసభ్యులు రసామయి బాలకిషన్ కు మన నిధులు మనకు రావడానికి కారణం కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే అని చెప్పలేకపోతున్నారున్నరు తెలంగాణ ఏర్పడి దశాబ్దం కాలం గడుస్తున్న ఇప్పటికి యువకులకు ఉద్యోగులు రాలేదు.విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వలేదు ఉద్యోగుస్తులకు పెన్షనర్లకు రావల్సిన బకాయిలు చెల్లించలేదు మరోవైపు టిఎస్పీయస్ నోటిఫికేషన్ ఇచ్చి పేపర్లు లీకేజీ చేసి నిరుద్యోగుల ఆత్మస్థెర్యం దెబ్బతీశారన్నారు మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని అయిదు లక్షల కోట్లు అప్పులు చేసి చివరకి జీతాలు పెన్షన్లు ఎప్పుడు పడతాయని ఎదురు చూసే పరిస్థితి తీసుకవచ్చిన ఘనత బిఆర్ యస్ ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. అకాల వర్షంతో రైతులు నష్టపోతే నష్టపరిహారం చెల్లించకపోగా సకాలంలో ధాన్యం కోనుగులు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నరు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓక్కసారి అవకాశం ఇవ్వలని ప్రజలు ఎదురుచూస్తున్నారని వినయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షడు పసుల వెంకటి, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శేఖర్, మైనర్టీ అధ్యక్షుడు జమాల్, బిసి సి సేల్ మండల నాయకులు వీరేశం, యసి సి సేల్ నాయకులు బడుగు లింగం, నగేష్, నరెందర్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments