దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
న్యూస్ పవర్ , 31 మే , ఇల్లంతకుంట :
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి అన్ని శాఖల అధికారులచే సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రాబోయే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కోరారు. జూన్ 2 నుండి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో అధికారులు తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మీర్జా,వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి, సూపర్డెంట్, ఏ పి ఓ చంద్రయ్య , సెక్రటరీలు మరియు ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments