JSON Variables

కందికట్కూర్ ఎల్లమ్మ జాతర లో పాల్గొన్న దరువు యెల్లన్న

కందికట్కూర్ ఎల్లమ్మ జాతర లో పాల్గొన్న  దరువు యెల్లన్న


న్యూస్ పవర్ , 31 మే , ఇల్లంతకుంట :
ఈ రోజు మానకొండూరు నియోజకవర్గం లోని  ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఎల్లమ్మ జాతర లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకుడు, జాతీయ సినిమా సెన్సర్ బోర్డు మెంబెర్ దరువు యెల్లన్న, బిజెపి మండల అధ్యక్షుడ నాగసముద్రాల సంతోష్, స్థానిక ఎంపీటీసీ దొమ్మటి కిషోర్ , బిజెపి నాయకులు. అమ్మ వారి దర్శనం అనంతరం దరువు యెల్లన్న  మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షలతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ దేవాలయానికి చరిత్రకా నేపథ్యంతో పాటు గొప్ప మహిమన్విత కలది గా పేర్కొన్నారు. ఇంతటి గొప్ప నేపథ్యం ఉన్న దేవాలయ అభివృద్ధికి మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్  స్థానిక ప్రజాప్రతినిధులు పాటుపడాలి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిని మరిచింది అన్నారు. కందికట్కూర్ ఎల్లమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్రము నుండి కాకుండా ప్రక్క రాష్ట్రాల నుండి కూడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొటుoన్నారు కావున భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ప్రభుత్వం వ్యవహారించాలి డిమాండ్ చేశారు.వీరి వెంట మండల ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు భూమల్ల అనిల్, మండల అధికార ప్రతినిధి భూమల్ల ప్రశాంత్,మండల కార్యదర్శి పల్లె సాయిప్రసాద్ రెడ్డి,ఇల్లంతకుంట పట్టణ అధ్యక్షుడు గంగం అనిల్, వజ్జెపల్లి శ్రీకాంత్,జంగిటి అజయ్,చదువల తిరుపతి,  రోహిత్,తాళ్లపల్లి కిషన్ దొమ్మాటి సురేష్, తాళ్లపల్లి మోహన్, రాచకొండ రాకేష్ ఎగుర్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments