మోడీ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన మండల బీజేపీ నాయకులు
న్యూస్ పవర్ , 27 మే , ఇల్లంతకుంట :
బిజెపి ఇల్లంతకుంట మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని జంగంరెడ్డి పల్లె గ్రామంలోని శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. పూజ అనంతరం నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు విస్తరింపజేసి ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూసేలా చేసిన కారణజన్ముడు నరేంద్ర మోడీ అని అన్నారు. మోడీ వంటి గొప్ప పరిపాలకుడు ప్రధాని కావడం మన అదృష్టం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించిన గొప్ప దార్శనికుడు నరేంద్ర మోడీ అన్నారు. నేడు ప్రపంచంలోనే విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ ని అది చూసి ఓర్వలేని కుహనా పార్టీలు మోడీ పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాయని దీన్ని దేశ ప్రజలు అంతా కూడా గమనిస్తున్నారని. దేశంలో పార్టీలకు అతీతంగా మోడీ యొక్క పాలనను అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు.రానున్న రోజుల్లో బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తిప్పారపు శ్రవణ్,మేకల మల్లేశం,పట్టణ అధ్యక్షుడు గంగం అనిల్,లోకోజు చంద్రం,మామిడి శేఖర్,మామిడి హరీష్,చౌదరి నాగరాజ్, పండుగ గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.
0 Comments