JSON Variables

బిక్షాటన చేసిన విఓఏలు

             బిక్షాటన చేసిన విఓఏలు

                   
 న్యూస్ పవర్  , 11 మే , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రము లో ఐకెపి విఓఏ లు ఎంపిడిఓ కార్యాలయం ఎదుట చేస్తున్న నిరసన కార్యక్రమాము మూడవ రోజుకు చేరింది, ఈ రోజు మండల కేంద్రంలో  భిక్షాటన చేసి నిరసన తెలిపారు,  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 
 వీఓవోలకు కనీస వేతనంనలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా కల్పించాలని, ఐడీ కార్డులు ఇవ్వాలని, జీవో నం. 58ని సవరించాలని డిమాండ్‌ చేశారు, వీవోఏల సంఘం అధ్యక్షురాలు అనురాధ మాట్లాడుతూ రూ.3 వేల వేతనంతో ఆర్థిక ఇబ్బందులు పడుతు న్నామన్నారు, ప్రభుత్వం తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు, అన్నపూర్ణ, పద్మ, భాలలక్ష్మి, రేణుక,అన్ని గ్రామాల వి ఓఏ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments