JSON Variables

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో పరామర్శించిన వోరగంటి

గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో  పరామర్శించిన వోరగంటి


జనం న్యూస్ , 11 మే , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం వెంకట్రావు పల్లె
 గ్రామానికి చెందిన మంద వంశీ గతకొన్ని రోజుల క్రితం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ తలకు  గాయం తీవ్ర అస్వస్థతకు గురై  హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా  తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యుడు వోరగంటి ఆనంద్  పరామర్శించి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని నింపి,మెరుగైన వైద్య చికత్సలు అందించాలని వైద్యులకు సూచించారు,రోడ్డుపై ధాన్యం పోయడం వల్ల చీకట్లో రోడ్డు ప్రమాదానికి కారణమని  కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన రైతులకు విజ్ఞప్తి చేస్తూ రైతులు యాసంగి ధాన్యాన్ని అమ్మకం నిమిత్తం రోడ్లపై ఎండపోయం వల్ల చుట్టూ పెద్ద పెద్ద బండరాల్లను పెట్టడం ద్వారా అత్యధిక ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు, కావున రైతులందరూ వీలైనంత మట్టుకు ధాన్యం రోడ్లపై ఎండపోయకుండా చూస్తూ ఒకవేళ రోడ్లపై పోయవలసి వస్తే ధాన్యం కుప్పల ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తూ విలువైన ప్రాణాలను కాపాడి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని  కోరారు 


Post a Comment

0 Comments