JSON Variables

బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత

బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందజేత

 న్యూస్ పవర్ , 29 ఏప్రిల్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీజేపీ మండల దళిత మోర్చా శాఖ ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారుల నుండి 3 లక్షలు  లంచం తీసుకున్న ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా దళిత మోర్చా మండల ఉపాధ్యక్షుడు మామిడి శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  మాట్లాడుతూ దళిత బంధు లబ్ధిదారుల వద్ద నుండి లంచం తీసుకున్న ఎమ్మెల్యే చిట్టా తన దగ్గర ఉందని వ్యాఖ్యానించారు, ముఖ్యమంత్రి వద్ద ఆ అవినీతి ఎమ్మెల్యే ల పేర్లు ప్రభుత్వం వారిచే విడుదల చేపించి, అట్టి ఎమ్మెల్యే లను పదవి నుండి తొలగించి వారిపై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం క్రింద కేసు నమోదు చేసి దళిత కుటుంబాలకు అన్యాయం చేసిన వారిపై తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ కో కన్వీనర్ బత్తిని స్వామి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ఇట్టిరెడ్డి లక్ష్మారెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు సూదుల కిషన్, శక్తి కేంద్రం ఇంఛార్జి దేశెట్టి శ్రీనివాస్, సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం, నాయకులు పున్ని రాజు, దూది సుధీర్, పొన్నం కృష్ణ, పున్ని అనిల్ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments