పుల్వామా దాడిలో చనిపోయిన అమరవీరులకు నివాళులు
న్యూస్ పవర్ , 14 ఫిబ్రవరి , ఇల్లంతకుంట :
ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా
ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా దాడిలో చనిపోయిన అమరవీరులకు బస్టాండ్ ఆవరణంలో మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది 250 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల విద్యార్థులు మరియు జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు , యువకులు ఏబీవీపీ కార్యకర్తలు అందరితో కలిసి జాతీయ జెండాతో కళాశాల నుంచి బస్టాండు వివేకానంద చౌరస్తా ఎమ్మార్వో కార్యాలయం వీధి వీధినా జాతీయ జండాలతో తిరంగా యాత్ర నిర్వహించి అనంతరం బస్టాండ్ ఆవరణంలో అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది ఈ సందర్బంగా ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ భారత అమరవీరులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని విద్యార్థులందరూ కూడా వారందరినీ గౌరవించాలని భవిష్యత్తులో విద్యార్థులు కూడా దేశ జవాన్లుగా మంచి పౌరులుగా దేశ అభివృద్ధి లో పాలుపంచుకోవాలని దేశానికి ఏ సమయంలో ఏ ఆపద వచ్చిన అందరు కూడా ముందు ఉండి దేశానికి రక్షణ కవచం లా ఉండాలి అని విదేశీ శక్తులను పరద్రోలాలి అని దేశ భక్తిని పెంపొదిచాలి అని అన్నారు ఈ కార్యక్రమం లో ఏబీవీపీ మండల్ కన్వీనర్ కూనబోయిన ప్రవీణ్, ప్రశాంత్, నరేష్, విజయ్, శివ ప్రసాద్, వరుణ్, చందు, శేఖర్,కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.
0 Comments