తండ్రి మరణించిన పేద విద్యార్థులకు చిదుగు గోవార్షన్ గౌడ్ ఆర్థిక సహాయం
పవర్ న్యూస్ , 25 ఫిబ్రవరి, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామానికి చెందిన వోల్లాల అంజయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి పిల్లల విద్యాబ్యాసం కొరకు 25000 రూపాయలు శనివారం రోజున సిరిసిల్లా జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిదుగు గోవార్థన్ గౌడ్ ఆర్ధిక సహాయం అందించారు. మృతుని కుమారులు ఇల్లంతకుంట మండల కేరళ మాడల్ స్కూల్ నందు 7 వ తరగతి మరొకరు ఏల్ కే జి చదువుచున్నారు . తమ పిల్లల పాఠశాల ఫిజులు చెల్లించలేని స్థితిలో ఉండి ఆర్థిక సహాయ నిమిత్తం విషయాన్ని ఇల్లంతకుంట మండల గౌడ సంఘం కన్వీనర్ గజ్జెల రాజశేఖర్ గౌడ్ ద్వారా జిల్లా అధ్యక్షులు గోవార్థన్ గౌడ్ కి తెలుపగా వేంటనే స్పందించి బాదిత కుటుంబ విద్యార్థులకు ఈ సంవత్సరం ఫిజు చిదుగు గోవార్థన్ గౌడ్ చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట గౌడ సంఘం అధ్యక్షుడు కోయ్యడ రాజయ్య జిల్లా కమిటీ మెంబర్ బత్తిని మల్లయ్య దోడ్ల దేవెందర్ ఒల్లాల రాయులు ఒల్లాల అనిత బండారి శ్రీనివాస్ మరియు ఫ్రిన్సిపాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
0 Comments