JSON Variables

నలుగురు దొంగల అరెస్టు

నలుగురు దొంగల అరెస్టు

 న్యూస్ పవర్ , 23 జనవరి , ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండలంలోని ఎర్రనర్సు పల్లి గ్రామంలో పర్స శంకర్ ,రాగుల పర్శరాం అనే మేకల కాపరిలకు చెందిన 15 మేకలు, అదే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు చెందిన మూడు విద్యుత్ మోటార్లను దొంగతనం చేసిన చిన్నకోడూర్ మండలం మాచాపూర్,విఠలాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు యువకులు, ఎర్రనర్సుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మామిడి మహేందర్ తెలిపారు,  మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు, నలుగురు నిందితుల నుంచి ₹39000ల నగదు, మూడు విద్యుత్ మోటార్లు, ఒక ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకుని ,అరెస్టు చేసి నలుగురు దొంగలను సిరిసిల్ల కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్సైతెలిపారు , తేదీ 18-01-2023 రోజున రాగుల పర్శరాం, పర్స శంకరయ్య,వీరిద్దరికి సంబంధించిన 15 గొర్రెలతో పాటు రాగుల పర్శరాం, రాగుల దుర్గయ్య, గుడిసె అజయ్ లకు సంబంధించిన మూడు మోటార్లు పోయినట్లు ఫిర్యాదు చేయగా ఇల్లంతకుంట ఎస్సై మామిడి మహేందర్, పోలీసు సిబ్బందితో కలిసి తేదీ-23-01-2023 సోమవారం ఉదయం ఇల్లంతకుంట శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎర్రనర్సు పల్లి కి చెందిన తోత్తళ్ల అనీల్, రాగుల అనీల్,  చిన్నకోడూర్ మండలం మాచాపూర్,విఠలాపూర్ గ్రామాలకు చెందిన  సముద్రాల శ్రీనివాస్, కోడూరి స్వామిలులను పట్టుకున్నారు.ఈకార్యక్రమంలో దొంగలను పట్టుకున్న ఎస్సై మహేందర్,పోలీసు సిబ్బంది ని సిరిసిల్ల రూరల్ సీఐ ఉపెందర్ అభినందించారు.

Post a Comment

0 Comments