JSON Variables

డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు

డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు

 న్యూస్ పవర్ , 12 నవంబర్ , ఇల్లంతకుంట :
ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని  నర్సక్క పేట గ్రామంలో డీసీఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ను  జెడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు ప్రారంభించారు,
 అనంతరం సిద్ధం వేణు మాట్లాడుతూ  పంటలను దళారులకు అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని సూచించారు. వేసవి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు
అరవై ఏళ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసి,
ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామాగా నిలిచిన
 ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  రైతులకు  కాళేశ్వర జలాలతో ప్రతి ఎకరానికి నీటి అందించి ఉచిత కరెంటు ఇచ్చి సకాలంలో ఎరువులను అందించి రైతులకు అండగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం పై కక్షపూరితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవరిస్తుందని అన్నారు, యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా మొండి వైఖరిని విడనాడి పంజాబ్ లో బీజేపీపాలిత రాష్ట్రంలో ఎలాగైతే వడ్లను కొంటున్నారో తెలంగాణాలో పండిన ప్రతి వడ్ల గింజను  కొనుగోలు చేయాలని బీజేపీప్రభుత్వనికి ఎంత మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినంటు ఉన్నది..దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.




లోకల్ యాడ్స్

Post a Comment

0 Comments